బాలకోట్ ఉదంతాన్ని ప్రధాని ప్రచారం చేయకూడదా ? చర్యలు తీసుకోనున్న ఈసీ
బాలకోట్ ఉదంతం ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో భారతీయా జనతా పార్టీకి ఎంతోకొంత మేలు చేస్తోంది. బాలకో్ట్ ఉదంతం ఆపార్టీకి ఓట్లను తెచ్చిపెట్టనుందని సర్వేలు సైతం తేల్చాయి. ఈనేపథ్యంలోనే బీజేపీ ప్రచారస్త్ర్రాంలో ప్రధానంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. దీంతో ప్రతిపక్షాలకు ఇది మింగుడుపడడం లేదు. ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోది తోపాటు అమిత్ షాను కట్టడి చేయడానికి విమర్శలు ఎక్కుపెట్టాయి.
ఈనేపథ్యంలోనే వారి వ్యాఖ్యలపై ఈసీ ఎలాంటీ చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలకు ఈసిపై విమర్శలు ఎక్కుపెట్టాయి. దీంతో బాలకోట్ ఉదంతం, భద్రతా బలగాలపై రాజకీయం చేసే వ్యాఖ్యల విషయంలో త్వరలో చర్యలు తీసుకుంటామని ఈసీ వర్గాలు మీడియా వెల్లడించారని తెలుస్తోంది. దీనిపై సమాచారం సేకరిస్తున్నట్టు కూడ పేర్కోన్నాయి. ఎన్నికలు పూర్తయ్యోవరకు కాకుండా త్వరలోనే నోటిసులు పంపించే అవకాశాలు ఉన్నట్టు ఓ జాతియ మీడియా పేర్కోంది.