వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ బోర్డర్: అనుమానాస్పద వస్తువు కూల్చివేత

|
Google Oneindia TeluguNews

జైపూర్‌/ఢిల్లీ: పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పదంగా గాలిలో ఎగురుతున్న ఒక గుండ్రని ఆకృతి(బెలూన్ లాంటి) వస్తువును భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన సుఖోయ్‌-30 యుద్ధ విమానం మంగళవారం కూల్చివేసింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు సుమారు 500 కి.మీల దూరంలోని బార్మర్‌ జిల్లా సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది.

భారత వైమానిక దళ అధికార వర్గాల సమాచారం ప్రకారం.. భారతదేశమంతా గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న సమయంలో ఉదయం 10.30 - 11 గంటల ప్రాంతంలో పాక్‌ వైపునకు ఉన్న పశ్చిమ సెక్టార్‌ నుంచి ఒక గుర్తుతెలియని బంతి ఆకారంలో ఉన్న వస్తువును ఐఏఎఫ్‌ రాడార్‌ గుర్తించడంతో దాన్ని కూల్చివేశారు.

sukhoi

ఈ విషయమై ఐఏఎఫ్‌ దర్యాప్తు జరుపుతోంది. అంతకు ముందు బార్మర్‌ ప్రాంతంలోని కొన్ని గ్రామాల ప్రజలు ఆకాశం నుంచి లోహపు తునకలు పడుతున్నట్లు ఫిర్యాదు చేశారు.

దీంతో అదనపు ఎస్పీ జస్సారాం బోస్‌ ఆధ్వర్యంలోని పోలీసు బృందం ఆ ప్రాంతానికి వెళ్లి త్రికోణాకారంలో ఉన్న 5 తునకలను పరిశీలించింది. అయితే అవి పేలుడు పదార్థాలు కావని నిర్ధారణకు వచ్చింది. ఆ తునకలను ఐఏఎఫ్‌కు అందజేసినట్లు పోలీసులు తెలిపారు.

English summary
A mysterious balloon-shaped object was on Tuesday shot down by a Sukhoi-30 fighter aircraft in Rajasthan’s Barmer district, bordering Pakistan, after the IAF radar detected it on a day the country was celebrating the Republic Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X