ధిక్కారమా?: సుప్రీంకోర్టు ముందే టపాసులు కాల్చారు, చిన్నారులకు పంచారు..
దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా విక్రయాలను తాత్కాలికంగా నిషేధిస్తూ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సంస్థ సభ్యులు ఏకంగా సుప్రీంకోర్టు ముందే టపాసులు కాల్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరస
Recommended Video
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా విక్రయాలను తాత్కాలికంగా నిషేధిస్తూ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో 'ఆజాద్ హింద్ ఫౌజ్' సంస్థ సభ్యులు ఏకంగా సుప్రీంకోర్టు ముందే టపాసులు కాల్చారు.
ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో వచ్చేనెల 1 వరకు బాణసంచా విక్రయాలపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు గతవారం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరసనలో భాగంగా న్యాయస్థానం గేటు ముందు మంగళవారం టపాసులు కాల్చిన ఘటనలో ముగ్గురు మహిళలు సహా మొత్తం 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Distributing crackers to Kids in Hari Nagar pic.twitter.com/a2CqIXjN2d
— Tajinder Bagga (@TajinderBagga) October 17, 2017
మరోవైపు బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధి తాజిందర్ బగ్గా పశ్చిమ ఢిల్లీలోని హరినగర్లో మురికివాడల చిన్నారులకు సంచులకొద్దీ టపాసులను పంచిపెట్టడం కూడా చర్చనీయాంశమైంది.
పిల్లలకు ఉచితంగా బాణసంచా పంపిణీ చేస్తున్న ఫొటోలు, వీడియోను బగ్గా స్వయంగా ట్విటర్లో ఉంచడం గమనార్హం. అంతేకాదు, ఈ పంపిణీ కోర్టు ధిక్కరణ కిందకు రాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. బహుమతిగా టపాసులు పంచిపెట్టడం నేరమేమీ కాదని.. బగ్గాపై చర్యలు తీసుకోబోమని ఢిల్లీ పోలీసువర్గాలు కూడా వెల్లడించాయి.
Firecrackers bursting in front of the Supreme Court to protest ban on them.
— Mohit Singh (@mohitsingh8) October 17, 2017
[Whatsapp Forward] pic.twitter.com/v8wn5orQkY
అనంతరం తాజిందర్ బగ్గా విలేకర్లతో మాట్లాడుతూ.. దీపావళికి ముందు టపాసుల విక్రయాలపై నిషేధం విధించడాన్ని తప్పుపట్టారు. ఈ ఆంక్షలు హిందువుల పర్వదినాన్ని లక్ష్యంగా చేసుకోవడమేనని పేర్కొన్నారు. నిషేధాన్ని ఏడాదంతా అమలు చేయాలని సూచించారు.