బర్డ్ ఫ్లూ టెన్షన్.. హస్తినలో చికెన్, ఎగ్ వంటకాల నిషేధం.. ఏయే ప్రాంతాల్లో అంటే..
బర్డ్ ఫ్లూ టెన్షన్ పుట్టిస్తోంది. కోళ్లు, కోడి గుడ్డు ద్వారా కూడా వైరస్ స్ప్రెడ్ అవుతోంది. దీంతో నాన్ వెజ్ ప్రియులు కోడి కంటే మటన్, చేపల వైపు మొగ్గచూపుతున్నారు. మటన్ ధర ఎక్కువయినా సరే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో చికెన్/ ఎగ్ వంటకాలపై నిషేధం విధించారు. ఈ మేరకు ఢిల్లీ నగరపాలక సంస్థ రెస్టారెంట్లకు ఆదేశాలు జారీచేసింది. చికెన్, ఎగ్ వంటకాలను సర్వ్ చేయొద్దని స్పష్టంచేసింది.
బర్డ్ ప్లూ ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో నిర్ధారణ జరిగింది. దీంతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆదేశాలను ధిక్కరించిన రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే రెస్టారెంట్లు చికెన్, ఎగ్ వంటకాలు సర్వ్ చేయొద్దని స్పష్టంచేసింది. చికెన్, ఎగ్స్ విక్రయాలు చేయొద్దని.. నిల్వ కూడా ఉంచుకోవద్దని తేల్చిచెప్పింది.
బర్డ్ ప్లూ వ్యాపించడంతో ఢిల్లీ ప్రభుత్వం.. ఎన్డీఎంసీ, ఎస్డీఎంసీ, ఎడీఎంసీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఆసియాలో పెద్ద చికెన్ మార్కెట్ ఢిల్లీలోని ఘజిపూర్లో ఉంది. కోళ్ల ద్వారా బర్డ్ ప్లూ పెరుగుతుందని భావించి.. అదీ కూడా మూసివేశారు.