థ్యాంక్యూ చంద్రబాబూ! మమతా దీదీ మమకారం
కోల్కత: కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందో, ఏమో గానీ కొన్ని నెలలుగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఏదీ కలిసి రావట్లేదు. దేశంలో ఎన్నికల వేడి రాజుకున్నప్పటి నుంచీ ఆమెకు సెగ పెడుతూనే వస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ. కారణాలేమైనప్పటికీ- మమతా దీదీ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుంది కేంద్ర ప్రభుత్వం. మొదట్లో సీబీఐ దాడులు, ఆ తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు వెంటవెంటనే చోటు చేసుకున్నాయి. వాటిని తట్టుకుని, కేంద్రాన్ని ఢీ కొట్టి నిలిచారు మమతా బెనర్జీ. ఇక- ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై దాడులు తీవ్రతరం అయ్యాయి.
పశ్చిమ బెంగాల్పై పట్టు సాధిస్తే.. అవలీలగా కేంద్రంలో అధికారాన్ని అందుకోవచ్చనేది బీజేపీ నేత వ్యూహం. అయిదా? పదా? 42 లోక్సభ స్థానాలు. వాటిల్లో మెజారిటీ స్థానాలను కొట్టగలిగితే - చాలనే అభిప్రాయంలో ఉంది బీజేపీ అగ్ర నాయకత్వం. నరేంద్ర మోడీ హవా భయంకరంగా వీచిన 2014లో కూడా పశ్చిమ బెంగాల్లో బీజేపీ చతికిల పడింది.
Thanks and gratitude to @Mayawati, @yadavakhilesh, @INCIndia, @ncbn and others for expressing solidarity and support to us and the people of #Bengal. EC's biased actions under the directions of the #BJP are a direct attack on democracy. People will give a befitting reply
— Mamata Banerjee (@MamataOfficial) May 16, 2019
42 స్థానాలకు ఆ పార్టీ దక్కించుకున్నది రెండే. అందుకే- 2019 ఎన్నికల్లో ఎలాగైనా పశ్చిమ బెంగాల్లో పాగా వేయడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. అందులో భాగంగా- మమతా బెనర్జీని ఇక్కట్లకు గురి చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ నిత్య పోరాటాలను ఎదుర్కొన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
Thanks and gratitude to @Mayawati, @yadavakhilesh, @INCIndia, @ncbn and others for expressing solidarity and support to us and the people of #Bengal. EC's biased actions under the directions of the #BJP are a direct attack on democracy. People will give a befitting reply
— Mamata Banerjee (@MamataOfficial) May 16, 2019
It is disturbing to see prompt action by the ECI on the complaint by @BJP4India and @AmitShah in West Bengal, while conveniently ignoring the complaints of @AITCofficial.
— N Chandrababu Naidu (@ncbn) May 15, 2019
తాజాగా అమిత్ షా రోడ్ షో సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలు కూడా మమతా బెనర్జీని ఇరుకున పెట్టడానికే అంటూ బీజేపీయేతర రాజకీయ పార్టీలు మండి పడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం బీజేపీని దుయ్యబట్టారు. చంద్రబాబు, మాయావతి, అఖిలేష్ యాదవ్ వంటి బీజేపీయేతర పార్టీలు మమతా బెనర్జీకి అండగా నిలిచారు. చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు కోల్కత వెళ్లి మరీ.. మమతా దీదీని పలకరించి వచ్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తనకు మద్దతు ఇచ్చినందుకు మమతా బెనర్జీ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ట్వీట్ చేశారు.
Mayawati: Election Commission has banned campaigning in West Bengal, but from 10 pm today just because PM has two rallies in the day. If they had to ban then why not from today morning? This is unfair and EC is acting under pressure pic.twitter.com/s7v0xpvAkO
— ANI (@ANI) May 16, 2019