వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బెంగళూర్లో భవనం కూలి ముగ్గురు మృతి?
పాఠశాల భవనంలో ఏడుగురు నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో తొలుత మంటలు లేచాయి. ఆ తర్వాత భవనం కూలింది. ఆ భవనంలో ఏడుగురు నివాసం ఉంటున్నట్లు సమాచారం. శిథిలాల కింద మరి కొంత మంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల కోసం ఐదు ఫైర్ టెండర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. హోసూరు రోడ్డులోని అడుగోడి గోపాలప్ప బ్లాక్లో గల ఆ పాఠశాల 1970లో ఏర్పడింది. కర్ణాటక మాధ్యమిక విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఆ పాఠశాల నడుస్తోంది.
Comments
English summary
Three people have been reportedly killed in a building collapse in Adugodi area of Bangalore in Karnataka.