వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మృతి: బెంగళూరు జైల్లో శశికళకు సమన్లు, ఇలా కుదరదు, చిన్నమ్మ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి ఏకసభ్య విచారణ కమిషన్ చిన్నమ్మ శశికళకు సమన్లు జారీ చేసింది.

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఈ మెయిల్ ద్వారా సమన్లు పంపించారు. విచారణకు సిద్దంగా ఉండాలని ఆర్ముగస్వామి విచారణ కమిషన్ శశికళకు సూచించింది.

Bangalore prison authorities informed Sasikala that she was summoned by Justice Arumugasamy commission

ఈమెయిల్ ద్వారా శశికళకు సమన్లు జారీ అయ్యాయని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు దృవీకరించారు. అయితే తనకు ఈమెయిల్ ద్వారా సమన్లు జారీ చేశారని, నేరుగా వచ్చి సమన్లు జారీ చేస్తే విచారణకు అంగీకరిస్తానని శశికళ తనదైన శైలిలో ఆర్ముగస్వామి విచారణ కమిషన్ కు సమాధానం ఇచ్చారని జైళ్ల శాఖ అధికారులు చెప్పారు..

ఇదే సందర్బంలో గురువారం చిన్నమ్మ శశికళతో భేటీ అయిన టీటీవీ దినకరన్ శశికళ 2018 జనవరి చివరి వరకూ మౌనవ్రతం చేస్తారని చెప్పడం కొసమెరుపు. మొత్తం మీద అతి త్వరలో బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళను ఆర్ముగస్వామి విచారణ కమిషన్ విచారణ చేసే అవకాశం ఉందని సమాచారం.

English summary
Bangalore prison authorities informed Sasikala that she was summoned by Justice Arumugasamy commission through e mail, and she replied will respond to them after received sumon directly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X