14th to 22nd july: బెంగళూరు రూరల్, అర్బన్ జిల్లాల్లో కంప్లీట్ లాక్ డౌన్
కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజులు బెంగళూరు రూరల్, అర్బన్ జిల్లాల్లో లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించొచ్చు అని భావిస్తోంది. ఈ మేరకు శనివారం కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Recommended Video
బెంగళూరు రూరల్, అర్బన్ జిల్లాల్లో 14వ తేదీ జూలై మంగళవారం రాత్రి 8 గంటల నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తోంది. 22వ తేదీ బుధవారం ఉదయం 5 గంటల వరకు కంప్లిటీ లాక్ డౌన్ కొనసాగుతోంది. అత్యవసర సేవలు తప్ప.. మిగిలిన వారిని అనుమతించారు. రాష్ట్రంలో ముఖ్యంగా.. బెంగళూరులో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు.
అత్యవసర సేవలు తప్ప మిగిలిన అన్ని సంస్థలు/సముదాయాలు విధిగా మూసివేయాల్సిందేనని స్పష్టంచేసింది. లాక్ డౌన్ సందర్భంగా మార్కెట్లు, కార్యాలయాలు మూసివేస్తారు. కానీ అత్యవసర సేవలు పాలు, కూరగాయాలు, మెడికల్ షాపు, బియ్యం దుకాణాలు మాత్రం తెరిచే ఉంటాయి. యూపీలో కూడా సోమవారం నుంచి లాక్ డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు పుణేలో కూడా లాక్ డౌన్ విధించారు.