అక్టోబర్ 22న బ్యాంకు ఉద్యోగుల సమ్మె... విలీనానికి నిరసనగా బంద్
జాతీయ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈనెల 22న దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియోషన్, బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్లు ఉమ్మడిగా సమ్మె చేస్తున్నట్టు ఇండియన్ బ్యాంకు అసోసియోషన్కు నోటీసులు అందించాయి.
బ్యాంకింగ్ సంస్కరణలతో పాటు కేంద్ర ఆర్ధిక మందగమనానికి తోడుగా బ్యాంకుల నష్టాల కారణంగా రెండు నెలల క్రితం బ్యాంకుల విలీనం పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 10 ప్రభుత్వ బ్యాంకులను కేవలం నాలుగు బ్యాంకుల్లో విలీనం చేస్తన్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు ఇండియాలో ఉన్న 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉండగా నాటీ ప్రకటనతో దేశంలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మాత్రమే ఉంటాయని ఆమె తెలిపారు.
అయితే బ్యాంకుల వీలీనంపై గతంలోనే ఆందోళన వ్యక్తం చేసిన ఉద్యోగుల యూనియన్లు వీలీన ప్రక్రియ ప్రారంభం కావడంతో మరోసారి తమ నిరసన వ్యక్తం చేసేందుకు సిద్దమయ్యారు. బ్యాంకుల విలీనం వల్ల అనేక వేల ఉద్యోగాలు, పదోన్నతులు కోల్పోయో అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల ఎగవేత దారుల నుండి డబ్బును రికవరి చేయడం ద్వార బ్యాంకుల కష్టాలు తీరుతాయని.. అందుకోసం బ్యాంకుల విలీనం చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. బ్యాంకింగ్ సంస్వకరణల పేరిట వినియోగదారులపై అధిక భారం వేయనున్నట్టు ఉద్యోగులు ఆరోపణలు చేశారు.కాగా సమ్మె నోటీసులో ఆరు కారణాలు పేర్కోన్నారు.