బెంగాల్లో పట్టుబిగిస్తోన్న బీజేపీ.. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో హవా
కోల్కతా : పశ్చిమబెంగాల్లో బీజేపీ క్రమంగా బలపడుతుంది. లోక్ సభ ఫలితాలు ఇచ్చిన బూస్టింగ్ ఇప్పుడు బెంగాల్ బార్ అసోసియేషన్కు చేరింది. అసోసియేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్యానల్ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో అధికార టీఎంసీకి గట్టి దెబ్బ తగిలింది.
బార్ అసోసియేషన్ ప్యానెల్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 8 సీట్లను కైవసం చేసుకుంది. అధికార టీఎంసీ మాత్రం నాలుగు సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. రెండు సీట్లను హస్తం పార్టీ, ఒక్క సీటును స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. అయితే బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవీని మాత్రం ఇండిపెండెంట్ అశోక్ కుమార్ ధందానియా కైవసం చేసకున్నారు. ఉపాధ్యక్ష పదవీని బీజేపీ అభ్యర్థి అజయ్ చౌబోకు దక్కింది. కార్యదర్శి పదవీకి ధీరజ్ కుమార్ ఎన్నికయ్యారు. వీరితోపాటు ఐదు కార్యవర్గ పదవులను బీజేపీ అభ్యర్థులు చేజిక్కుంచుకున్నారు. కోశాధికారి పోస్టు మాత్రం అధికార టీఎంసీకి చెందిన ధ్వారకనాథ్ ముఖోపాధ్యాయ్ చేజిక్కించుకున్నారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపడం ఇదే మొదటిసారి అని .. ఇప్పటివరకు టీఎంసీ హవా కొనసాగేదని చెప్తున్నారు.