ఇంత ఆటవికమా?: కేరళలో బహిరంగంగా గోవును వధించడంపై రాహుల్ ఆగ్రహం
కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా ఆవును వధించడంపై ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు తనకు, తన పార్టీకి ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు
న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా ఆవును వధించడంపై ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు తనకు, తన పార్టీకి ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు.
అనాలోచితంగా, ఆటవికంగా ఈ చర్యకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆవును బహిరంగంగా వధించిన కారణంగా ముగ్గురు కేరళ కాంగ్రెస్ కార్యకర్తలను ఆ పార్టీ సస్పెండ్ చేసింది.
కబేళాలకు పశువులను విక్రయించడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరళ కాంగ్రెస్ యువజన విభాగం నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. కొందరు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వాహనంలో అందరూ చూస్తూండగానే 18 నెలల వయసుగల ఆవును హత్య చేశారు.
What happened in Kerala yesterday is thoughtless,barbaric& completely unacceptable to me &the Congress Party.I strongly condemn the incident
— Office of RG (@OfficeOfRG) May 28, 2017
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆవు మాంసాన్ని అక్కడ ఉన్నవారికి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సంఘటనపై విమర్శలు రావడంతో కొందరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.