బీజేపీ త్రిపురలో వేసిన మాస్టర్ ప్లాన్ కర్ణాటకలో ఫలిస్తుందా, అందుకే శ్రీరాములు, గాలి!
బెంగళూరు: త్రిపురలో 25 ఏళ్ల పాటు ఎదురులేకుండా ఆధిపత్యం సాగించిన సీపీఐ(ఎం) పార్టీని నామరూపాలు లేకుండా చేసిన బీజేపీ ఇప్పుడు కర్ణాటకలో అదే ప్లాన్ తో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. త్రిపురలో వేసిన పాచికలు కర్ణాటకలో వెయ్యాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. అయితే బీజేపీ పాచికలు ఎంత వరకు పారుతాయో మే 15వ తేదీ వరకు వేచిచూడాలి.
ప్రజలకు భరోసా
త్రిపురలో రికార్డుస్థాయిలో 91 శాతం పోలింగ్ జరిగింది. త్రిపురలో అధికారంలోకి ఎవరురావాలి అనే విషయంలో యువత, గుడ్డుగాడు ప్రజలు (ఎస్టీ)లు కీలకపాత్ర పోషించారు. త్రిపురలో ఎస్టీలను ఆకట్టుకోవడంలో సీపీఐ(ఎం) విఫలం అయ్యింది.
బీజేపీ మాస్టర్ ప్లాన్
త్రిపురలోని యువతను ఆకట్టుకోవడానికి బీజేపీ శక్తివంచన లేకుండా సోషల్ మీడియాను ఉపయోగించుకుంది. ఇక బీజేపీ నాయకులు గుడ్డగాడు కులస్తులకు వరలా వర్షం కురిపించి ఆ వర్గం నాయకులను పదవుల విషయంలో తెర మీదకు తెచ్చింది. యువత, గుడ్డుగాడు కులస్తులను ఆకట్టుకున్న బీజేపీ 25 ఏళ్ల సీపీఎం (ఐ) సామ్రాజ్యాన్ని కుప్పకూల్చింది.
తెరమీదకు బళ్లారి ఎంపీ
బీజేపీ నాయకులు బళ్లారి లోక్ సభ సభ్యుడు బి. శ్రీరాములును సార్ట్ ప్రచారకర్తగా తెరమీదకు తీసుకు వచ్చారు. కర్ణాటకలో బుడకట్టు కులస్తులు, ఎస్సీ, ఎస్టీలు, వాల్మీకిల ఓట్లను ఆకట్టుకోవడానికి త్రిపుర, నాగాల్యాండ్ లో వేసిన మాస్టర్ ప్లాన్ ను బీజేపీ నాయకులు ఇక్కడ వేస్తున్నారు.
ప్రజా నాయకుడు
బళ్లారి ఎంపీ శ్రీరాములును బీజేపీ నాయకులు రాష్ట్రస్థాయి నాయకుడిని చేశారు. వాల్మీకి కులస్తుల ఓట్లతో పాటు హైదరాబాద్ కర్ణాటక, మధ్య కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల ఓట్లు కొల్లకొట్టడానికి పావులు కదుపుతున్నారు. 80 నియోజక వర్గాల్లో శ్రీరాములుతో ప్రచారం చేయించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది.
గాలి జనార్దన్ రెడ్డి ఎఫెక్ట్
ఐదు జిల్లాల్లో బీజేపీ వీలైనన్ని ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకోవాలని నిర్ణయించింది. బళ్లారి ఎంపీ శ్రీరాములు తన ప్రాణ స్నేహితుడు గాలి జనార్దన్ రెడ్డితో కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. మోళకాల్మూరుతో పాటు బాదామిలో సీఎం సిద్దరామయ్యకు శ్రీరాములు గట్టిపోటీ ఇస్తున్నారని స్థానికులు అంటున్నారు.
రెడ్డి వలన బీజేపీకి లాభం
శ్రీరాములు తన స్నేహితుడు గాలి జనార్దన్ రెడ్డి సహాయం తీసుకోవడం బీజేపీకి లాభమే కాని నష్టం లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి అంటున్నారు. అయితే శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి శ్రమ ఎంత వరకు ఫలిస్తుందో మే 15వ తేది వరకు వేచి చూడాలి.