జీఎస్టీ వల్లే చనిపోతున్నా!: బెంగాల్లో వ్యాపారి ఆత్మహత్య.. ఎందుకలా?
అయితే జీఎస్టీ కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ అతను సూసైడ్ నోట్ లో పేర్కొనడం గమనార్హం.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్కు చెందిన పినాకిదత్త(45) అనే హోల్ సేల్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే జీఎస్టీ కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ అతను సూసైడ్ నోట్ లో పేర్కొనడం గమనార్హం.
బీర్బం జిల్లాలోని నారాయణపూర్ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. విషం తాగడం వల్లే పినాకిదత్త ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. 'నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు.. జీఎస్టీ మాత్రమే' అంటూ పేర్కొన్న సూసైడ్ లెటర్ ఒకటి మృతదేహం పక్కన లభించింది.

అయితే సూసైడ్ లేఖలో పేర్కొన్నది ఎంతమేర నిజమన్న దానిపై అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేసిన తర్వాతే నిజనిజాలను నిర్దారిస్తామని స్థానిక సూపరిండెంట్ పోలీస్ సుధీర్ తెలిపారు. మృతుడి బంధువు ఒకరు మాట్లాడుతూ.. పినాకిదత్త చాలా మంచివాడని, గత కొంతకాలంగా వ్యాపారం పట్ల అతను దిగులుతో ఉన్నాడని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications