జీఎస్టీ వల్లే చనిపోతున్నా!: బెంగాల్లో వ్యాపారి ఆత్మహత్య.. ఎందుకలా?
అయితే జీఎస్టీ కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ అతను సూసైడ్ నోట్ లో పేర్కొనడం గమనార్హం.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్కు చెందిన పినాకిదత్త(45) అనే హోల్ సేల్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే జీఎస్టీ కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ అతను సూసైడ్ నోట్ లో పేర్కొనడం గమనార్హం.
బీర్బం జిల్లాలోని నారాయణపూర్ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. విషం తాగడం వల్లే పినాకిదత్త ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. 'నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు.. జీఎస్టీ మాత్రమే' అంటూ పేర్కొన్న సూసైడ్ లెటర్ ఒకటి మృతదేహం పక్కన లభించింది.

అయితే సూసైడ్ లేఖలో పేర్కొన్నది ఎంతమేర నిజమన్న దానిపై అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేసిన తర్వాతే నిజనిజాలను నిర్దారిస్తామని స్థానిక సూపరిండెంట్ పోలీస్ సుధీర్ తెలిపారు. మృతుడి బంధువు ఒకరు మాట్లాడుతూ.. పినాకిదత్త చాలా మంచివాడని, గత కొంతకాలంగా వ్యాపారం పట్ల అతను దిగులుతో ఉన్నాడని పేర్కొన్నారు.
More From
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications