కేపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, ముగ్గులోకి దింపిన లేడీ మోడల్స్, విదేశాల్లో బుక్కీ మకాం!
బెంగళూరు: కర్ణాటక ప్రీమియమ్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ మ్యాచ్ సందర్బంగా మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విచారణ చేస్తున్న సీసీబీ పోలీసులు బుక్కీని అరెస్టు చేశారు. క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ నిర్వహించి విదేశాల్లో తలదాచుకున్న బుక్కీ సయ్యం అనే నిందితుడిని అరెస్టు చేశామని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు. కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించి విదేశాల్లో తలదాచుకున్న బుక్కీలు సయ్యం, మరో వ్యక్తిని అరెస్టు చెయ్యడానికి బెంగళూరు సీసీబీ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.
పేరుకే టీచర్, ఆ ముసుగులో కామేశ్వరి ఎన్ని అరాచకాలు, సోషల్ మీడియాలో ?!
2019 ఆగస్టు 31వ తేదీ మైసూరులో కేపీఎల్ లో భాగంగా బళ్లారి టస్కర్స్, హుబ్బళ్ళి టైగర్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. మైసూరులో జరిగిన కేపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో భారీగా బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని బెంగళూరు సీసీబీ పోలీసులకు సమాచారం అందింది.
1 ఓవర్ కు 10 రన్ లు ఇస్తే రూ. 5 లక్షలు ఇస్తామని మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. 1 ఓవర్ కు 10 రన్ లు ఇచ్చిన వారికి సయ్యం రూ. 5 లక్షలు ఆఫర్ ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో యువతులు, లేడీ మోడల్స్ తో క్రికెట్ ఆటగాళ్లను బుక్కీ సయ్యం సంప్రధించాడని పోలీసులు వివరాలు సేకరించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్రమ సంబంధం, లేడీ వలలో పడి బతుకు బూడిద, భార్య!
కేపీఎల్ బెట్టింగ్ కు సంబంధించి విచారణ చేస్తున్న సీసీబీ పోలీసులు ఇప్పటికే బెళగావి ఫ్యాంథర్స్ జట్టు యజమాని అశ్వఖ్ ఆలీ తార్, బళ్లారి టస్కర్స్ టీం డ్రమ్మర్ భవేశ్, బెంగళూరు బ్లాస్టర్స్ టీం బౌలింగ్ కోచ్ విను ప్రసాద్, బ్యాట్స్ మెన్ విశ్వనాథన్ ను అరెస్టు చేశారు. కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించి విదేశాల్లో తలదాచుకున్న బుక్కీలను అరెస్టు చెయ్యడానికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన సీసీబీ పోలీసులు ఇప్పుడు సయ్యంను అరెస్టు చేసి మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.