'పోర్న్' చూడమని భర్త వేధింపులు.. నగ్న చిత్రాలు లీక్ చేస్తానని బ్లాక్మెయిల్
బెంగళూరు: తన భర్త అశ్లీల చిత్రాలు చూడాల్సిందిగా తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ(38) విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గర్భవతిని కావడం లేదన్న కారణంతో భర్త తనను వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంది.
విద్యారణ్యపుర పోలీస్ ఒకరు దీనిపై స్పందించారు. వరకట్న వేధింపులకు సంబంధించి డా.మంజునాథ్ పై మార్చి 7వ తేదీని కేసు నమోదు చేశామని తెలిపారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని అన్నారు.
మంజునాథ్ కంటే ఆయన భార్య 15ఏళ్లు చిన్నదని, పెళ్లయి మూడేళ్లు అవుతున్నా.. పిల్లలు కలగడం లేదని అతను ఆమెను వేధిస్తున్నాడని తెలిపారు. అశ్లీల చిత్రాలు చూసి.. అందులో చేసినట్టుగా చేయాలని బలవంతపెడుతున్నట్టు చెప్పారు. అయితే మంజునాథ్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నట్టు వెల్లడించారు.
తాను చెప్పింది చేయకపోతే.. నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని మంజునాథ్ తన భార్యను బెదిరించినట్టు పోలీసులు పేర్కొనడం గమనార్హం. మంజునాథ్ తో పాటు అతని సోదరుడు, అత్త మామలపై కూడా ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.