కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: తల్లిదండ్రులతో కలిసి వచ్చిన కుణిగల్ గిరి, తెలీదు !
బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీషీటర్ కుణిగల్ గిరి శుక్రవారం బెంగళూరులోని సిట్ (ఎస్ఐటీ) కార్యాలయం దగ్గరకు వచ్చాడు. తల్లిదండ్రులతో కలిసి సిట్ కార్యాలయానికి వచ్చిన కుణిగల్ గిరి రెండు గంటల పాటు అక్కడే ఉన్నాడు.
కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: రౌడీషీటర్ కుణిగల్ గిరి విచారణ, అనంతపురంలో!
సిట్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో కుణిగల్ గిరి అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లాడు. ఈ సందర్బంలో కుణిగల్ గిరి మీడియాతో మాట్లాడుతూ గౌరీ లంకేష్ హత్య కేసుతో తనకు, తన అనుచరులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.
తన ప్రత్యర్థులు కావాలనే తన మీద సిట్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని కుణిగల్ గిరి ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం రామనగర సెంట్రల్ జైల్లో సిట్ అధికారులు తనను విచారణ చేసి వివరాలు సేకరించారని అన్నారు. గురువారం సాయంత్రం తాను బెయిల్ మీద బయటకు వచ్చానని చెప్పాడు.
ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ తో సహ 17 మందికి బందోబస్తు!
శుక్రవారం సిట్ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించడంతో తన తల్లిదండ్రులతో కలిసి స్వయంగా వచ్చానని, ఇక్కడ అధికారులు లేపోవడంతో తిరిగి వెలుతున్నానని కుణిగల్ గిరి చెప్పాడు. అధికారులు ఎప్పుడు పిలిచినా సిట్ కార్యాలయానికి రావడానికి తాను సిద్దంగా ఉన్నానని కుణిగల్ గిరి అన్నాడు. మూడు సంవత్సరాల తరువాత బెయిల్ మీద బయటకు వచ్చిన రౌడీషీటర్ కుణిగల్ గిరి మరో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.