డిసెంబర్ 20న బెంగుళూరులో మిడ్నైట్ మారథాన్ (ఫోటో)
బెంగుళూరు: డిసెంబర్ 20న బెంగుళూరులో మిడ్నైట్ మారథాన్ నిర్వహించనున్నారు. ఓ ఛారిటీ కోసం విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా ఈవెంట్ని 8వసారి నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్కి మొత్తం 15 సంస్ధలు ప్రచారకర్తలుగా వ్వవహరిస్తున్నారు. టైటిల్ స్పాన్సర్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ ఈవెంట్ను నిర్వహణ మొత్తం రోటర్ బెంగుళూరు ఐటీ కారిడార్ (ఆర్బీఐటీసీ) పర్యవేక్షిస్తుంది.
మారథాన్ టైమింగ్స్:
* సాయంత్రం 4 గంటలకు కమ్యూనిటీ రిలే: ఈ రిలేలో కమ్యూనిటీ ఆధారంగా ఐదుగురు టీమ్ సభ్యులను పాల్గొంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్క కిలోమీటరు పరుగెత్తుతారు. తర్వాత మరో టీమ్ సభ్యుడికి వారి చేతిలో ఉన్న బ్యాటన్ అందిస్తారు. ఇలా ఐదుగురు సభ్యులు ఐదు కిలోమీటర్లు దూరం పరిగెత్తుతారు.
* సాయంత్రం 6 గంటలకు ఐటీ సీటీ ఫన్ రన్: ఇది ఫ్లాగ్షిప్ ఈవెంట్. ఈ ఈవెంట్లో కుటుంబం మొత్తం పాల్గొనొచ్చు. ఐతే ఐటీ ప్రోపెషనల్స్ ఇందులో పాల్గొనకూడదు.
* రాత్రి 7:30ని మహిళల 10కె రన్: ఇది ప్రత్యేకించి మహిళల కోసం నిర్వహిస్తున్న ఈవెంట్. ఈ ఈవెంట్ మహిళలో ధైర్యం నింపేందుకు నిర్వహిస్తున్నారు.
* రాత్రి 7:45ని మహిళల రిలే: ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశ్యం బెంగుళూరులో ఉన్న ఎన్జీవోలకు విరాళాలు సేకరించడం. ఈ ఈవెంట్లో 8 మంది సభ్యులు పాల్గొనొచ్చు. ఒక్కో సభ్యుడు 5కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంటుంది.
* రాత్రి 10 గంటలకు టార్గెట్ ఓపెన్ 10కె రన్: ఈ ఈవెంట్లో సెలబ్రటీల సరసన పరుగు తీసే అవకాశం ఉంది.
* రాత్రి 12 గంటలకు పుల్ మారథాన్: ఈ ఈవెంట్లో ముఖ్యమైన పరుగు పందెం. బెంగుళూరు ఐటీ కారిడార్లో సుమారు 42.195 కిలోమీటర్లు దూరం పరుగెత్తాల్సి ఉంటుంది.
* రాత్రి 12 గంటలకు కేర్వెల్ హాఫ్ మారథాన్: ఈ పరుగు పందెంలో 21 కిలో మీటర్లు పరుగెత్తాల్సి ఉంది.
* రాత్రి 12:15నిలకు ఎయిర్బస్ కార్పోరేట్ రిలే: మిడ్నైట్ మారథాన్లో భాగంగా బెంగుళూరులో ఉన్న కార్పోరేట్ వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లో 8గురు సభ్యులు ఒక జట్టుగా పాల్గొనొచ్చు.
బెంగుళూరు మిడ్ నైట్ మారథాన్లో ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్ కూడా పాల్గొంనుండటం విశేషం. ఈ మారథాన్ ద్వారా వచ్చిన విరాళాలను రోటర్ బెంగుళూరు ఐటీ కారిడార్ (ఆర్బీఐటీసీ) ఛారిటీలకు ఉపయోగించనుంది.
మరిన్ని వివరాల కోసం ఈ వెబ్సైట్ను సందర్శించండి