హెచ్ఆర్ మహిళ ఉద్యోగి దారుణ హత్య, శవం మీద అత్యాచారం, అపార్ట్ మెంట్ లో కామాంధుడు!
మణిపురకు చెందిన లైన్ రామ్ హెంబాసింగ్ (21) అనే వికృత కామాంధుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఐటీపీఎల్ మెయిన్ రోడ్డులో క్రైస్ట్ సర్వీస్ అపార్ట్ మెంట్ ఉంది. 33 ఏళ్ల మహిళ ముంబైలోని కంపెనీలో 15 రోజులు, మిగిలిన రోజులు బెంగళూరులోని ఐటీపీఎల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నది.
హెచ్ఆర్ విభాగంలో సీనియర్ ఉద్యోగినిగా పని చేసే ఆమె అపార్ట్ మెంట్ 7వ అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ 701లో నివాసం ఉంటోంది. ఫిబ్రవరి 9వ తేదీన రాత్రి 8.30 గంటల సమయంలో నిందితుడు లైన్ రామ్ హెంబాసింగ్ ఫ్లాట్ లో ఉన్న మహిళకు భోజనం ఇవ్వడానికి వెళ్లాడు.
ఆ సందర్బంలో మహిళ ఒంటరిగా ఉందని తెలిసింది. ఒంటరిగా ఉన్న మహిళపై కామాంధుడు లైన్ రామ్ అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ మహిళ ప్రతిఘటించడంతో నిందితుడు ఆమె మీద దాడి చేసి ఊపిరి రాకుండా చేసి హత్య చేశాడు.
మహిళను హత్య చేసిన నిందితుడు ఆమె శవం మీద అత్యాచారం చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మహిళ కార్యాలయానికి రాకపోవడం, ఫోన్ కు అందుబాటులో లేకపోవడంతో సాటి ఉద్యోగులకు అనుమానం వచ్చింది. అదే సందర్బంలో ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాడుగోడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మహిళ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మహిళను హత్య చేసిన తరువాత శవం మీద అత్యాచారం చేశాడని, లైన్ రామ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కాడుగోడి పోలీసులు తెలిపారు.