Bengaluru: మంత్రి డెవలపర్స్ సీఈవో అరెస్టు, రూ. 1,000 కోట్లు ‘మంత్రి’గారు ఏంచేశారంటే ?, ఈడీ దెబ్బతో !
బెంగళూరు/న్యూఢిల్లీ: దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన మంత్రి డెవలపర్స్ సీఇఓ, ఎండీ అయిన సుశీల్ పాండురంగ మంత్రి అలియాస్ సుశీల్ మంత్రిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తప్పుడు పబ్లిసిటీ ఇచ్చి ప్రజల నుంచి సుమారు రూ. 1,000 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి వాటిని తన సొంత అవసరాల కోసం వాడుకున్నారని, ప్రజలను మోసం చేశారని, అందుకే సుశీల్ మంత్రిని అరెస్టు చేశామని ఈడీ అధికారులు అంటున్నారు. బెంగళూరులో సుమారు 7 నుంచి 10 సంవత్సరాలు అయినా ప్రజలకు ఫ్లాట్లు ఇవ్వకుండా మోసం చేశారని, ఐటీ అధికారులకు పన్ను ఎగవేశారని సుశీల్ మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక బ్యాంకుల నుంచి మంత్రి డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతో సుమారు రూ. 5,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారని ఈడీ అధికారుల విచారణలో వెలుగు చూసింది.
IAS
Son:
ఐఏఎస్
మీద
అవినీతి
ఆరోపణలు,
ఇంట్లో
సోదాలు
చేస్తుంటే
ఐఏఎస్
కొడుకు
ఆత్మహత్య
!

రియల్ ఎస్టేట్ వ్యాపారం
బెంగళూరుకు చెందిన సుశీల్ పాండురంగ మంత్రి మంత్రి డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుతున్నారు. బెంగళూరు నగరంలోని మల్లేశ్వరంలో అతి పెద్ద మంత్రిమాల్ కూడా ఉంది. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల్లో మంత్రి డెవలపర్స్ కూడా ఒకటి అని అధికారులు అంటున్నారు.

ఫ్లాట్స్ ఇస్తామని డబ్బులు వసూలు
ప్రజలకు విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్స్ ఇస్తామని తప్పుడు పబ్లిసిటీ ఇచ్చి ప్రజల నుంచి సుమారు రూ. 1,000 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేశారని మంత్రి డెవలపర్స్ ఎండీ సుశీల్ మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తరువాత ప్రజలకు ఫ్లాట్స్ ఇవ్వకుండా వారి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడంతో విసిగిపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

బ్యాంకుల నుంచి రూ. 5 వేల కోట్లు !
వివిద
బ్యాంకులు,
ఫైనాన్స్
సంస్థల
నుంచి
మంత్రి
డెవలపర్స్
కొన్ని
ఆస్తుల
పత్రాలు
ఇచ్చి
సుమారు
రూ.
5,000
కోట్లకు
పైగా
అక్రమంగా
రుణాలు
తీసుకుందని
ఈడీ
అధికారులు
ఆరోపిస్తున్నారు.
బెంగళూరులో
సుమారు
7
నుంచి
10
సంవత్సరాలు
అయినా
ప్రజలకు
ఫ్లాట్లు
ఇవ్వకుండా
మోసం
చేశారని,
ఐటీ
అధికారులకు
పన్ను
ఎగవేశారని
సుశీల్
మంత్రి
ఆరోపణలు
ఎదుర్కొంటున్నారు.

‘మంత్రి’గారు అరెస్టు
మంత్రి డెవలపర్స్ అవకతవకలు, అక్రమ లావాదేవీల విషయంపై కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు సుశీల్ మంత్రిని ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. ఎంత ప్రశ్నించి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకోవాలని చూసిన సుశీల్ మంత్రిని అరెస్టు చేశామని, ఆయన్ను ఈడీ న్యాయాలయం ముందు హాజరుపరిచి న్యాయమూర్తి అనుమతితో 10 రోజులు కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నామని ఈడీ అధికారులు అంటున్నారు.