బెంగళూరు టార్గెట్, దాడులకు స్కెచ్ వేసిన ఉగ్రవాది అరెస్టు, పైసా వసూల్, అగర్తలాలో !
బెంగళూరు: బెంగళూరు నగరంలో దాడులు చెయ్యడానికి ఉగ్రవాదులు స్కెచ్ వేశారు. బెంగళూరు టార్గెట్ చేసుకుని దాడులు చెయ్యడానికి ప్రయత్నించిన ఉగ్రవాదిని జాతీయ భద్రతా దళం (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. త్రిపురలో తలదాచుకున్న ఉగ్రవాది నజీర్ షేక్ ను అరెస్టు చేసిన అధికారులు నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారని తెలిసింది. నజీర్ షేక్ బెంగళూరులో పైసా వసూల్ చేసి ఉగ్ర కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నాడని వెలుగు చూసింది.
బెంగళూరులో లైవ్ బ్యాండ్ అమ్మాయిలు, హైటెక్ వ్యభిచారం, రెచ్చిపో, విటులకు వల!
జమత్ ఉల్ ముజాహుద్దీన్
జమత్ ఉల్ ముజాహుద్దీన్ సంస్థకు చెందిన హబీబుల్లా రెహమాన్ ను ఇంతకు ముందు ఎన్ఐఏ అధికారులు బెంగళూరులో అరెస్టు చేశారు. నిందితుడు హబీబుల్లా రెహమాన్ బెంగళూరు గ్రామీణ జిల్లా సమీపంలోని రామనగరలోని బ్రిడ్జ్ సమీపంలో సజీవంగా ఉన్న గ్రెనైడ్ లు దాచి పెట్టడంతో వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరులో ఐదు మంది
బెంగూరులో దాడులు చెయ్యడానికి ఐదు మంది ఉగ్రవాదులు పక్కాప్లాన్ వేశారని అధికారులు గుర్తించారు. నిందితుడు హబీబుల్లా రెహమాన్ అరెస్టు తరువాత మిగిలిన ఉగ్రవాదులు బెంగళూరు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారని అధికారులకు సమాచారం అందింది.
ప్లాన్ చెప్పిన ఉగ్రవాది
బెంగళూరులో హబీబుల్లా రెహమాన్ ను అరెస్టు చేసి రామనగర్ లో సజీవంగా ఉన్న గ్రెనేడ్ లు స్వాధీనం చేసుకున్న తరువాతే అందరూ నగరం వదిలి వెళ్లిపోయారని ఇప్పుడు అరెస్టు అయిన ఉగ్రవాది నజీర్ షేక్ అధికారుల విచారణలో అంగీకరించాడని వెలుగు చూసింది.
అగర్తలాలో మకాం
త్రిపురలోని అగర్తలాలో ఉగ్రవాది నజీర్ షేక్ తలదాచుకున్నాడు. బెంగళూరులో అరెస్టు అయిన హబీబుల్లా రెహమాన్ ఇచ్చిన సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదుల కోసం గాలిస్తుంటే అగర్తలాలో నజీర్ షేక్ తల దాచుకున్న విషయం గుర్తించి అరెస్టు చేశారు.
బెంగళూరులో పైసా వసూల్
బెంగళూరు నగరంలోని చిక్కబాణవారలో నివాసం ఉంటున్న నజీర్ షేక్ స్థానికంగా నివాసం ఉంటున్న కొందరి నుంచి నగదు సేకరించి జమత్ ఉల్ ముజాహుద్దీన్ ఉగ్రవాద కార్యకలాపాలకు చేరవేస్తున్నాడని దర్యాప్తు చేస్తున్న అధికారులు అన్నారు.
ఏం స్కెచ్ వేశారు ?
నగదు వసూలు చెయ్యడమే కాకుండా పేలుడు పదార్థాలు సేకరించి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని గుర్తించిన ఎన్ఐఏ అధికారులు నజీర్ షేక్ ను అరెస్టు చేసి రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. నిందితులు ఏం స్కెచ్ వేశారు అని అధికారులు ఆరా తీస్తున్నారు.