ఎన్నికల ఖర్చుకోసం జెర్సీలను వేలం వేసిన మాజి ఫుట్ బాల్ క్రిడాకారుడు
ఎన్నికల్లో పోటి చేయాలంటే కోటీశ్వరులు కావాలి, లేదంటే ఏదైనా పార్టీ అండ ఉండాలి, లేదంటే స్వంత అస్తులు అమ్ముకోవాలి ,లేదా తమకు ఇష్టమైన వస్తువులను వేలం వేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి ..ఇది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్,
ఫుల్లుగా తాగాడు..పక్కింటో దూరి వేధించాడు..! మనస్తాపంతో మహిళ మ్రుతికి కారణమయ్యడు ఎదవ..!!
ఈ నేపథ్యంలోనే సిక్కిం రాష్ట్రానికి చెందిన భారత్ ఫుట్బాల్ జట్టు మాజి కెప్టెన్ బైచుంగ్ భూటియా ఇదే పని చేశారు.ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు తనకు ఆటలో వచ్చిన రెండు జెర్సీలను ఆన్ లైన్ లో వేలం వేశారు. ఇవి తాను పోటి చేస్తున్న స్థానాల్లో ఖర్చు కోసం వేలం పెట్టినట్టు ఆయన తెలిపారు
బైచుంగ్ భూటియా ''హమ్ రో సిక్కిం'' పార్టీ పేరుతో సోంతంగా ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. ఈనేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో మొదటి సారిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే ఎన్నికల ఖర్చుల కోసం భూటియా విరాళాలు సేకరించేందుకు తనకు ఇష్టమైన రెండు జెర్సీలను వేలానికి పెట్టారు.ఇందులో ఒకటి 2012 లో తన వీడ్కోలు మ్యాచ్ ధరించిందని చెప్పారు.
కాగా ఫుట్ బాల్ నుండి రిటైర్ అయిన తర్వాత భూటియా రాజకీయాల్లోకి ప్రవేశించారు.తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 లోక్ సభతోపాటు, 2016 జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో పోటి చేశారు.ఈ ఎన్నికల్లో భుటియా గ్యాంగ్టక్, తుమిన్ లింగ్ అనే అసెంబ్లి స్థానాల నుండి బరిలోకి దిగనున్నారు.