మోడీ ప్రభుత్వం హక్కులను హరిస్తోంది: భారత్ బంద్
Recommended Video
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 ద్వారా ప్రభుత్వ కార్మికుల హక్కులను హరిస్తోందని ఆరోపిస్తూ పలు కార్మిక సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా పాల్గొనాలని నిర్ణయించింది. జనవరి 8, 9 తేదీలు.. రెండు రోజుల పాటు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.
కేంద్రం చేపడుతున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఈ బంద్కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. కేంద్రం పారిశ్రామికవేత్తలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తమ పన్నెండు డిమాండ్లను కేంద్రం ముందుంచాయి. పది పెద్ద ట్రేడ్ యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ సమ్మెలో భాగంగా భారత్ బంద్, రైల్ రోకో, రోడ్ రోకో, నిరసన ప్రదర్శనలు, ఇతర ఆందోళనలు చేపడుతున్నారు.
-
పది
ట్రేడ్
యూనియన్లు
48
గంటల
(జనవరి
8,
9)
బంద్కు
పిలుపునిచ్చాయి.
అయితే
మంగళవారం
దాని
ప్రభావం
పెద్దగా
కనిపించలేదు.
-
పశ్చిమ
బెంగాల్లో
తాము
బంద్కు
మద్దతివ్వడం
లేదని
ముఖ్యమంత్రి
మమతా
బెనర్జీ
వెల్లడించారు.
జరిగిందేదో
జరిగిందని,
గత
34
ఏళ్ల
లెఫ్ట్
హయాంలో
బంద్ల
కారణంగా
రాష్ట్రం
బాగా
నష్టపోయిందని,
కాబట్టి
అలాంటి
బంద్లు
తమకు
వద్దని
చెప్పారు.
-
భారత్
బంద్
ప్రభావం
దేశంలోని
చాలా
చోట్ల
అంతగా
కనిపించలేదని
తెలుస్తోంది.
ఎప్పుడైనా
బంద్
ప్రభావం
ఉదయమే
తెలుస్తుంది.
కానీ
మంగళవారం
ఉదయం
ఎక్కువచోట్ల
అంతగా
ప్రభావం
చూపలేదని
తెలుస్తోంది.
-
లెఫ్ట్
ప్రభుత్వం
ఉన్న
కేరళలో
మాత్రం
రైళ్లను
అడ్డుకున్నారు.
తిరువనంతపురం
రైల్వే
స్టేషన్లో
రైళ్ల
రాకపోకలను
అడ్డుకున్నారు.
-
హౌరాలో
కూడా
సెంట్రల్
ట్రేడ్
యూనియన్
మెంబర్స్
రైళ్లను
అడ్డుకున్నారు.
-
బంద్
కారణంగా
పలుచోట్ల
ప్రజలు
ఇబ్బందులు
పడుతున్నారు.