84 ఏళ్ల సామాజిక కార్యకర్త అరెస్ట్: భీమా కోరెగావ్ హింసతో సంబంధం, వారెంట్ చూపించకుండా..
భీమా కోరేగావ్ హింసకు సంబంధించి ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. అయితే గురువారం రోజున అధికారులు ఓ సామాజిక కార్యకర్త, 83 ఏళ్ల ఫాదర్ జెసూట్ (స్టాన్ స్వామి)ను అదుపులోకి తీసుకున్నారు. 2018 జనవరి 1వ తేదీన పుణె సమీపంలో భీమా-కోరెగావ్ వద్ద హింస చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో పాత్ర ఉందని పలువురు వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
కేంద్రంలో ఉండగా..
బాగైచా
సామాజిక
కేంద్రంలో
స్వామి
ఉంటున్నారు.
అక్కడికి
జార్ఖండ్
ఎన్ఐఏ
అధికారులు
వచ్చి
అరెస్ట్
చేస్తున్నామని
తెలిపారు.
ఆ
సమయంలో
ర్యాష్గా
ప్రవర్తించారని..
వారెంట్
కూడా
చూపించలేదని
స్వామి
సహచరులు
పేర్కొన్నారు.
అయితే
ఇదే
కేసులో
ఈ
ఏడాది
ఆగస్టులో
ఎన్ఐఏ
అధికారులు
ప్రశ్నించారు.
దీంతోపాటు
2018లో
మహారాష్ట్ర
పోలీసులు
ఇంటి
వద్ద
తనిఖీ
చేసి
కంప్యూటర్
స్వాధీనం
చేసుకున్నారు.
పుణె
సమీపంలోని
భీమా-కోరేగావ్
దగ్గర
2018
జనవరి
1న
హింస
చెలరేగిన
సంగతి
తెలిసిందే.
ఆ
రోజున
లక్షలాది
మంది
దళితులు
ఇక్కడ
సమావేశం
కానున్నారు.
ఎల్గాన్ పరిషత్ సదస్సు.. రెచ్చగొట్టారని..
హింస చెలరేగడానికి ఒక రోజు ముందు 2017 డిసెంబర్ 31న పుణెలో ఎల్గాన్ పరిషత్ను నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న వారు చేసిన ప్రసంగాలు మరుసటి రోజు హింసను రాజేశాయని ఆరోపిస్తూ ఫిర్యాదు నమోదైంది. ఆ ఫిర్యాదు ప్రాతిపదికగా పుణె పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎల్గార్ పరిషత్ వెనుక మావోయిస్టుల హస్తం ఉందని.. మావోయిస్టు సంస్థలతో సంబంధం ఉందనే అనుమానిస్తున్నారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వామపక్ష వైఖరి గల ఉద్యమకారులు చాలా మందిని పుణె పోలీసులు అరెస్ట్ చేశారు.
Recommended Video
రంగంలోకి ఎన్ఐఏ
అందులో విరసం నేత వరవరరావు కూడా ఉన్నారు. అయితే తాజాగా స్వామిని కూడా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పుణె పోలీసులు నవంబర్ 15, 2018 తేదీన చార్జీషీట్ దాఖలు చేశారు. తర్వాత 2019 ఫిబ్రవరి 21వ తేదీన అనుబంధ చార్జీషీట్ కూడా దాఖలు చేశారు. ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేయడంతో ఈ ఏడాది జనవరి 24వ తేదీన దర్యాప్తు చేపట్టింది.