భోగి పొగ: చెన్నైకి వెళ్లాల్సిన విమానాలు హైదరాబాద్, బెంగళూరుకు మళ్లింపు
చెన్నై: భోగి మంటలతో భారీగా పెరిగిన పొగ కారణంగా చెన్నైకి వెళ్లాల్సిన పలు విమానాలను బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలకు మళ్లించినట్లు తెలిపారు. శనివారం బోగి పండగను తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకుంటున్నాయి.
శనివారం ఉదయం 4-8గంటల మధ్య కాలంలో చెన్నైలో దిగాల్సిన విమానాలను హైదరాబాద్, బెంగళూరు విమానాలకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 9గంటల నుంచి పొగ ప్రభావం తగ్గే అవకాశం ఉండటంతో చెన్నైకి యధావిధిగా విమానాలు చేరుకుంటాయని తెలిపారు.
ఇప్పటి వరకు సుమారు 18 విమానాలను బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలకు మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. కువైట్, షార్జా, ఢిల్లీల నుంచి విమానాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఈ కారణంగా కొంత ఆలస్యంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరే అవకాశం ఉందని తెలిపారు.
Comments
welcome 2018 bhogi smoke flights chennai hyderabad bengaluru makar sankranti sankranti 2018 సంక్రాంతి సంక్రాంతి 2018 విమానాలు చెన్నై హైదరాబాద్ బెంగళూరు
English summary
Flight services in and out of this city suffered today following a thick cover of smoke due to 'Bhogi' festival celebrations, airport officials said.
Story first published: Saturday, January 13, 2018, 9:10 [IST]