వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిగ్గీ రాజాకు షాక్.. కాంగ్రెస్ సభలో మోడీకి ప్రశంసలు.. యువకుడిని తోసేసిన వైనం (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : డిగ్గీ రాజాకు షాక్.. కాంగ్రెస్ సభలో మోడీకి ప్రశంసలు..! || Oneindia Telugu

భోపాల్ : ఎన్నికల వేళ చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ప్రచారంలో నేతలు చేసే ఫీట్లు నవ్వు తెప్పిస్తుంటాయి. అదే సమయంలో ప్రత్యర్థులపై చేసే ఆరోపణలు రివర్స్ అవుతుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో అలాంటి సంఘటనే జరిగింది. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోడీపై ఆరోపణలు గుప్పిస్తూ.. చివరకు తాను ఇరకాటంలో పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భోపాల్ లోక్‌‌సభ నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో డిగ్గీ రాజాకు ఓ యువకుడు షాకిచ్చాడు. అక్కడి సభలో ఉద్వేగంగా మాట్లాడుతున్న దిగ్విజయ్ సింగ్ మోడీ టార్గెట్ గా ఆరోపణాస్త్రాలు సంధించారు. ఆ క్రమంలో ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో 15 లక్షల రూపాయలు మోడీ వేస్తామన్నారు. మీలో ఎవరికైనా వచ్చాయా అంటూ అక్కడున్నవారిని అడిగారు. దాంతో ఒక యువకుడు చేయి ఎత్తడంతో స్టేజీ పైకి రమ్మని ఆహ్వానించారు. మోడీ సర్జికల్ స్ట్రైక్స్ చేసి టెర్రరిస్టులను అంతమొందించారు, అది చాలు అని ఆ యువకుడు చెప్పిన సమాధానంతో డిగ్గీ రాజా సహా అక్కడున్న కాంగ్రెస్ నేతలకు షాక్ కు గురయ్యారు.

కాంగ్రెస్ సభలో మోడీపై ప్రశంసలు కురిపించడంతో ఈ వీడియో బాగా వైరల్ అయింది. అయితే డిగ్గి రాజాకు ఒక క్షణం పాటు ఏమి అర్థం కాలేదు. ఆ తర్వాత తేరుకుని యువకుడి చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు. స్టేజీపై ఉన్న మరో లీడర్ ఆ యువకుడి మెడపై చేతులు వేసి స్టేజి పైనుంచి కిందకు నెట్టివేశారు.

Bhopal youth praises PM Modi before Digvijaya Singh gets pushed off stage

వినియోగదారుల ఇష్టమే ఫైనల్..! కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లకు ట్రాయ్ వార్నింగ్ వినియోగదారుల ఇష్టమే ఫైనల్..! కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లకు ట్రాయ్ వార్నింగ్

ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో నాలుగు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మే 12న భోపాల్‌లో పోలింగ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే23న వెలువడనున్నాయి.

English summary
Congress veteran leader Digivijaya Singh's rally in Bhopal took a funny turn. He was trying to attack the Bharatiya Janata Party government over its failure to provide jobs but the jibe didn't land as intended. A video posted on social media shows a smiling Digvijaya Singh asking the crowds to raise their hands if they received Rs 15 lakh rupees. When a young man in the audience raised his hand, Digvijaya Singh called him to come to the stage and narrate his account of receiving the mythical sum. Sauntering on to the stage, the young man said, "Modi ji killed terrorists by doing surgical strikes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X