సైకిల్ కోసం దాచుకున్న రూ.9వేలు వరద బాధితులకు, చిన్నారికి హీరో కంపెనీ బంపరాఫర్
తిరువనంతపురం: కేరళ వరద బాధితులకు తమిళనాడుకు చెందిన అనుప్రియ అనే చిన్నారి సైకిల్ కోసం దాచుకున్న తన రూ.9వేల మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది. ఆమె ఈ సొమ్మును నాలుగేళ్లుగా దాచుకుంది. కేరళలో వరద బీభత్సం తెలిసిందే. దీంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో ఎంతోమంది సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
కేరళ వరద పరిస్థితి, సహాయం గురించి టీవీలో చూసిన చిన్నారి అనుప్రియ నాలుగేళ్లుగా తాను సైకిల్ కొనేందుకు దాచుకున్న రూ.9వేలను వరద బాధితులకు ఇచ్చింది. ఆమె ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించింది. ఈ విషయం పేపర్లలో వచ్చింది. దీనిపై హీరో సైకిల్ కంపెనీ స్పందించింది.
అనుప్రియను అభినందించింది. ఆమెకు కొత్త సైకిల్ బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం అనుప్రియను తమ ఈ మెయిల్కు అడ్రస్ పంపించాలని అడిగింది. ఇంతలోనే హీరో సైకిల్స్ ఎండీ పంకజ్ ముందా స్పందించారు. చిన్నారి అనుప్రియకు ప్రతి ఏటా ఓ సైకిల్ చొప్పున జీవితాంతం ఇస్తామని తెలిపారు.
Recommended Video
శివసేన ప్రజాప్రతినిధుల సహకారం
కేరళ వరద బాధితులకు శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనం ఇచ్చారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు కూడా రూ.20 కోట్ల భారీ విరాళాన్ని ఇచ్చాయి. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించాయి. తెలంగాణ పీసీసీ తరఫున కూడా ఆర్థిక సాయం అందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నెల వేతనం ఇచ్చారు.
Anupriya, parnam to you. You are a noble soul and wish you spread the good around. Hero is too pleased to give you one bike every year of your life. Pl share your contact on my account. Love you and best wishes. Prayers for Kerala https://t.co/vTUlxlTnQR
— Pankaj M Munjal (@PankajMMunjal) August 19, 2018