ముంబై-హైదరాబాద్ మార్గంలో బుల్లెట్ ట్రైన్... ఎన్హెచ్ఆర్సీఎల్ నుంచి కీలక అప్డేట్...
ముంబై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్కు వేగంగా అడుగులు పడుతున్నాయి. 711కి.మీల ఈ మార్గంలో బుల్లెట్ రైలును తీసుకొచ్చేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్(NHSRCL) కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 5వ తేదీన ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందులో బుల్లెట్ కారిడార్ మార్గానికి సంబంధించిన సర్వే,ఉపరితల మార్గం,అండర్ గ్రౌండ్ మార్గం,సబ్ స్టేషన్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. తద్వారా ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్) నివేదికను రూపొందించనున్నట్లు ఎన్ఎహెచ్ఆర్సీఎల్ ప్రతినిధి సుష్మా గౌర్ వివరాలను వెల్లడించారు.
ఈ కారిడార్కు సంబంధించి నవంబర్ 18 నుంచి టెండర్ల ప్రక్రియ మొదలవుతుందన్నారు. విజయవంతమైన బిడ్డర్కు టెండర్ ఖరారు చేయడం జరుగుతుందన్నారు. ఇటీవలే మరో ఏడు కారిడార్లలోనూ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ నుంచి డీపీఆర్లను ఆహ్వానించింది. ఇందులో ఢిల్లీ-అమృత్సర్-చంఢీగఢ్,ఢిల్లీ-వారణాసి,ముంబై-నాగపూర్,ఢిల్లీ-అహ్మదాబాద్ కారిడార్లు ఉన్నాయి. వీటితో పాటే ముంబై-పుణే-హైదరాబాద్ బుల్లెట్ కారిడార్ను అభివృద్ది చేయనుంది. చెన్నై-మైసూర్,వారణాసి-హౌరా మార్గాలకు ఇంకా టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ బుల్లెట్ కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్రధాన నగరాల మధ్య దూరం మరింత తగ్గుతుంది. తద్వారా వాణిజ్య,వ్యాపార రంగాలు మరింత అభివృద్ది చెందుతాయి.

2022 నాటికి దేశంలో బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా రైల్వే రూపు రేఖలు మారిపోతాయని చెబుతోంది. ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ కారిడార్ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య 500కి.మీ రైలు ప్రయాణానికి 8గంటల సమయం పడుతుండగా బుల్లెట్ రైలుతో కేవలం 2గం. 7 నిమిషాల సమయం మాత్రమే పట్టనుంది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications