సైరస్ మిస్త్రీ మృతి.. మోడీ, సుప్రియ సూలే సహా పలువురు సంతాపం..
టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. దీంతో పలువురు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మిస్రీ మరణంపై ప్రధాని మోడీ సంతాపం తెలియజేశారు. అతను గొప్ప పారిశ్రామిక వేత్త అని కొనియాడారు. అతని మరణం ప్రపంచ వ్యాపార రంగానికి గొప్ప లోటు అని చెప్పారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Recommended Video
మిస్త్రీ మరణంపై ఎన్సీపీ నేత సుప్రీయ సూలే ట్వీట్ చేశారు. తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తోందని తెలిపారు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని తెలిపారు. అతని ఆత్మకు శాంతి కలుగాలని కోరుకుంటున్నామని వివరించారు.

మిస్త్రీ మరణం తమకు షాక్నకు గురిచేసిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ అన్నారు. అతనితో చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉందన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా సంతాపం తెలిపారు. అతని ఆత్మకు శాంతి కలుగాలని కోరుకున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా సంతాపం తెలియజేశారు.
సైరస్ మిస్త్రీ మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబయి తిరిగి వస్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు రోడ్డు డివైడర్ను గట్టిగా ఢీకొట్టింది. ప్రమాదంలో సైరస్ మిస్త్రీ తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచారు. పాల్ఘాట్ ప్రాంతంలోని చరోటీ వద్ద సూర్యా నది వంతెనకు సమీపంలో ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వారిని గుజరాత్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. సైరస్ మిస్త్రీ దుర్మరణం పట్ల వ్యాపార, రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications