ఎన్నికలకు ముందు ఉత్సాహం: కాంగ్రెస్ పార్టీలో చేరిన బిగ్బాస్ విజేత శిల్పాషిండే
ముంబై: బిగ్ బాస్ 11 విజేత శిల్పా షిండే మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంజయ్ నిరుపమ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొంతకాలంగా శిల్పా షిండే రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
వాటిపై ఆమె స్పందించింది లేదు. 1999లో బాగా ప్రాచుర్యం పొందిన టీవీ సీరియల్ బాబీ జీ ఘర్ పర్ హై సీరియల్లో అంగూరీ బాబీ పాత్ర ద్వారా ఆమె బుల్లి తెర పైన కనిపించారు. 2017 అక్టోబర్లో బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. బిగ్బాస్ సీజన్ 11 విజేతగా నిలిచారు.
మహారాష్ట్రలో లోకసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఇది మరో ప్లస్ కానుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో 48 లోకసభ స్థానాలకు గాను కేవలం రెండింట మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో పొత్తుతో వెళ్తోంది.
Renowned Actress Shilpa Shinde Joins Congress today under the leadership of Mumbai Congress Chief @sanjaynirupam pic.twitter.com/Nm47xLT4Ap
— MumbaiCongress (@INCMumbai) February 5, 2019