Love Affair:అమ్మాయింట్లో అడ్డంగా దొరికాడు: మర్మాంగంను కోశారు: ఆ తర్వాత ఏం జరిగింది..?(Video)
బీహార్: దేశంలో ఉత్తర్ప్రదేశ్ తర్వాత ఎక్కువ నేరాలు బీహార్లోనే జరుగుతుంటాయి. అయితే ఈ నేరాల గురించి చెబితే ఒళ్లు వణికిపోతుంది. ఆ రేంజ్లో ఇక్కడి క్రైమ్ స్టోరీస్ ఉంటాయి. తాజాగా బీహార్లోని ముజఫర్పూర్లో ఓ దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయి మరో అబ్బాయిని ప్రేమించడమే ఈ దారుణానికి కారణం. ప్రేమించిన అమ్మాయిని వదిలేసి అబ్బాయిపై కుటుంబ సభ్యులు దాడి చేశారు. దాడి అంటే అలా ఇలా కొట్టడం కాదు.. ఏకంగా ప్రియుడి మర్మాంగాన్నే కోసేశారు. ఆ తర్వాత ఏం జరిగిందింటే....
ప్రేమించిన పాపానికి...
బీహార్లోని ముజఫర్పూర్లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన పాపానికి ఆ యువకుడిని ఏకంగా కాటికే పంపారు అమ్మాయి కుటుంబ సభ్యులు. ఎంత దారుణమంటే ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం మర్మాంగం కోసేశారు. పోలీసుల కథనం ప్రకారం రేపూర రాంపురుష్ గ్రామంకు చెందిన 17 ఏళ్ల సౌరభ్ కుమార్ పక్కనే ఉన్న సోర్బారా అనే గ్రామంకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఈ అమ్మాయి కూడా సౌరబ్ను ప్రేమించింది. అయితే అమ్మాయి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సౌరభ్ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చారు.
అమ్మాయి ఇంట్లో అలా...
ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు సౌరభ్ను ఆ అమ్మాయిని కలిసి ఉండటం చూసి ఎక్కడ లేని కోపం తెచ్చుకున్నారు. ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు సౌరభ్ను వెంటాడి పట్టుకుని చితకబాదారు. వదిలేయాలంటూ ఎంత ప్రాధేయపడినా జాలి చూపని ఆ కుటుంబ సభ్యులు సౌరభ్ మర్మాంగంను కోసేశారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న సౌరభ్ను స్థానికులు తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చి అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
Recommended Video
అబ్బాయి కుటుంబ సభ్యులు ఏం చేశారంటే..
చికిత్స పొందుతూ అదే రోజు సౌరభ్ ప్రాణాలు విడిచాడు. సౌరభ్ను కొట్టి చంపిన వారిలో సుశాంత్ పాండే అనే వ్యక్తిని గుర్తించిన కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేశారు. అంతేకాదు అమ్మాయి ఇంటి ముందే సౌరభ్ దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.సౌరభ్ హత్యకేసులో మరికొందరు నిందితులు తప్పించుకు తిరుగుతున్నారని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.