నో రిటైర్మైంట్: నితీశ్ కామెంట్స్పై పార్టీ రియాక్షన్.. సీరియస్గానే చేశారు.. కానీ...
బీహర్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత ప్రచారం నేటితో ముగిసింది. అయితే సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని కామెంట్ చేశారు. అయితే దీనిపై జేడీయూ పార్టీ స్పందింతచింది. అబ్బే అలాంటిదీ ఏమీ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నితీశ్ చేసిన కామెంట్స్ నిజం కాదని.. ఆయన నేతృత్వంలో ముందుకుసాగుతామని పేర్కొన్నది.
పుర్నియా ర్యాలీలో నితీశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సారి ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆర్జేడీ, ఎల్జేపీ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నడూ లేనివిధంగా ఎన్డీఏను గెలిపించాలని.. మోడీ పేరు చెప్పి మరీ నితీశ్ ప్రచారం. శనివారం మూడో విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. కానీ పార్టీ మాత్రం ఖండిస్తోంది. నితీశ్ నేతృత్వంలో ముందుకెళ్తామని చెబుతున్నారు.
అయితే జేడీయూ సీనియర్ నేత అశోక్ చౌదరీ మాత్రం.. నితీశ్ కామెంట్స్ సీరియస్గానే చేశారని తెలిపారు. భారీ జనం మధ్య ఉద్వేగపూరితంగా ప్రసంగించారని వెల్లడించారు. కానీ నితీశ్ మాత్రం విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకుసాగుతానని.. విజయం సాధిస్తామా లేదా అన్నది ప్రశ్నేనని నితీశ్ చెప్పినట్టు తెలుస్తోంది.