తేలనున్న 3577 మంది బీహర్ నేతల భవితవ్యం, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్త్..
బీహర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. 38 జిల్లాల్లో గల 55 సెంటర్లలో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 9 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవుతోంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న బ్యాలెట్ బాక్సులు ఉంచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లను మొహరించింది.
Recommended Video
Bihar Elections Exit Polls 2020: ఎన్డీఏకు మెజార్టీ సీట్లు.. దైనిక్ భాస్కర్..ఈటీజీ బీహర్ మాత్రం
రాష్ట్రంలో 12 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. మూడు విడతల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 57 శాతం ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంలలో నిక్షిప్తమైన 3 వేల 755 మంది నేతల భవితవ్యం ఇవాళ తేలనుంది. ఈ ఎన్నికల్లో నితీశ్ కుమార్ పోటీ చేయలేదు. ఎందుకంటే ఆయన మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్నారు. కానీ ఆయన 12 మంత్రులు సహా, స్పీకర్ బరిలో ఉన్నారు.
పాట్నా సాహిబ్ నుంచి నంద్ కిశోర్, మోటిహరి నుంచి ప్రమోద్ కుమార్, మదుబన్ నుంచి రన రందీర్, ముజఫర్ నగర్ నుంచి సురేశ్ శర్మ, నలందా నుంచి శ్రావణ్ కుమార్, దినారా నుంచి జై కుమార్ సింగ్, జెహనాబాద్ నుంచి కృష్ణనందన్ ప్రసాద్ వర్మ బరిలో ఉన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈవీఎంల వద్ద, బూతుల వద్ద ప్రికాషన్స్ తీసుకున్నారు.
ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీహరీలు మహగడ్ బందన్ కూటమికి మొగ్గుచూపుతారని లెక్కలు కట్టాయి. ఎన్డీఏ కూటమికి పరాజయం తప్పదని చెప్పాయి. అయితే మెజార్టీ పోల్స్ మాత్రం హంగ్ కూడా ఏర్పడే అవకాశం ఉందని తెలిపాయి.