వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాన్ ఇండియా: తెలంగాణ నుంచి బిహార్ దాకా: 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు: బీజేపీ పట్టు

|
Google Oneindia TeluguNews

బిహార్: ప్రస్తుతం బిహార్‌లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కొన్ని చోట్ల పూర్తయింది. ఉత్తరాది రాజకీయాల్లో ఇరుసుగా చెప్పుకొనే బిహార్ సహా వేర్వేరు రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో తన పట్టు నిలుపుకొంది. కొన్ని కొత్త స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు, అటు పశ్చిమం నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకూ 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కౌంటింగ్ నడుస్తోంది. పాన్ ఇండియాా ఎన్నికలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.

Recommended Video

Counting of votes for 58 Assembly by-polls across 11 states

దుబ్బాకలో ఓడిందెవరు?: మాస్ లీడర్ ఛరిష్మా ఏమైంది? కల్వకుంట్ల కోటపై కాషాయ జెండా: పతన సంకేతం? దుబ్బాకలో ఓడిందెవరు?: మాస్ లీడర్ ఛరిష్మా ఏమైంది? కల్వకుంట్ల కోటపై కాషాయ జెండా: పతన సంకేతం?

బిహార్‌ను మినహాయిస్తే.. ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, ఒడిశా, తెలంగాణల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఆయా రాష్ట్రాల్లో మొత్తం 58 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించారు. వాటిల్లో 40 చోట్ల బీజేపీ ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇందులో కొన్నింటిని తన ఖాతాలో వేసుకుంది కూడా. తెలంగాణలో దుబ్బాకలో ఘన విజయాన్ని అందుకుంది. అధికార టీఆర్ఎస్‌ను ఓడించింది. కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగిన రాజరాజేశ్వరి నగర, శిరాల్లో గెలుపొందింది.

Bihar Assembly Election Results 2020: Pan India elections exhibits the BJP credibility

బిహార్‌లో బీజేపీ పరిస్థితి హోరాహోరీగా సాగుతోంది. తొలుత ఆధిక్యతలోకి దూసుకెళ్లిన బీజేపీ ఆధిక్యత మళ్లీ తగ్గుముఖం పట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రీయ జనతాదళ్‌కు ఊపిరిపోసినట్టయింది. గుజరాత్‌లో ఎనిమిదికి ఎనిమిది, ఉత్తర ప్రదేశ్‌లో ఎనిమిదికి ఎనిమిదింటినీ బీజేపీ గెలుచుకోగలిగింది. కర్ణాటకలో రెండు స్థానాలకు రెండింటిలోనూ కమలనాథులు విజయం సాధించారు. నాగాలాండ్, మణిపూర్‌లల్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో 28 స్థానాల్లో 22 చోట్ల కాషాయ జెండా ఎగిరింది. దీన్ని బట్టి చూస్తే.. పాన్ ఇండియాగా సాగిన ఈ ఎన్నికల్లో బీజేపీ తన పట్టును నిలుపుకొందనేది స్పష్టమౌతోంది.

English summary
BJP leaders says that the Pan India elections including Bihar exhibits the high level of endorsement for the way Narendra Modi led NDA Government. This elections are navigated the country through Covid 19. BJP got the credibility from the voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X