లాలూ ప్రసాద్ రికార్డు బ్రేక్: ప్రచారంలో కొత్త ఒరవడి: ఒకేరోజు అన్ని ఎలా సాధ్యం?
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ కోసం సన్నాహాలు పూర్తయ్యాయి. 17 జిల్లాల్లో 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు రెండోదశ పోలింగ్ ఆరంభం కాబోతోంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికల ప్రచార పర్వం పోలింగ్ నాటికి రెండురోజుల ముందే ప్రచార పర్వానికి తెరపడింది.
Recommended Video
हम युवाओं को रोजगार, गरीब को तरक्की, व्यवसायी को बढ़ता व्यापार, किसान को फसल अपार, महिलाओं को सुरक्षित संसार, छात्रों को प्रतिभा का विस्तार, हर बिहारवासी को उन्नत बिहार देंगे।
— Tejashwi Yadav (@yadavtejashwi) November 1, 2020
बिहार कमाई, दवाई, पढ़ाई और सिंचाई जैसे मुद्दों पर चुनाव लड़ रहा है। pic.twitter.com/9TusuYq1zA
రాజకీయ పార్టీలన్నీ ఇక మూడోదశపై దృష్టి సారించాయి. ఈ నెల 7వ తేదీన తుదిదశ పోలింగ్ ఉంటుంది. 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. రెండోదశ ఎన్నికల ప్రచార పర్వంపై రాష్ట్రీయ జనతా దళ్ ఆధిపత్యాన్ని చలాయించినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత, మాజీ మంత్రి తేజస్వి యాదవ్.. సుడిగాలి పర్యటన సాగించారు. 19 బహిరంగ సభలను నిర్వహించారు.. ఒక్కరోజు వ్యవధిలోనే. బిహార్ రాజకీయ చరిత్రలో ఇదో రికార్డు.
ఈ విషయంలో తేజస్వి యాదవ్.. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రికార్డును తిరగరాశారు. ఇదివరకు లాలూ ప్రసాద్ యాదవ్.. ఒక్కరోజు వ్యవధిలో 16 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. తేజస్వి యాదవ్ దాన్ని బ్రేక్ చేశారు. 19 సభల్లో పాల్గొన్నారు. ఇందులో 17 బహిరంగ సభలు.. రెండు రోడ్షోలు ఉన్నాయి. ఉదయం 10:05 నిమిషాలకు సీతామర్హి నుంచి తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ఆయన ఆరంభించారు. వైశాలి జిల్లాలోని బిదూపూర్లో సాయంత్రం 4:45 నిమిషాలకు చివరి సభలో పాల్గొన్నారు.
So the man in action sets the record of 19 rallies in a single day across the Bihar.
— Sanjay Yadav (@sanjuydv) October 31, 2020
Gets down from chopper, straight away run towards stage,cheerful crowd welcomes him, holds the mike, delivers a fiery speech with engaging & responsive crowd, finishes it and runs for next point pic.twitter.com/m0EmRTgqUq
నిరంతరాయంగా ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగాయి. ఈస్ట్ చంపారన్, వెస్ట్ చంపారన్, గోపాల్గంజ్, సివాన్, వైశాలి జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఈ సారి రాష్ట్రీయ జనతా దళ్ సంకీర్ణ కూటమిని అధికారంలోకి తీసుకుని రావడానికి తేజస్వి యాదవ్ ఎంత పట్టుదలతో ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు నాయకులు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మోస్ట్ పాపులర్ లీడర్గా తేజస్వి నిలిచినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
यह जनता मालिकों का 15 वर्षों की निरकुंश सत्ता के प्रति जनाक्रोश है। किसान, नौजवान, छात्र-शिक्षक सब इस भ्रष्ट सरकार से त्रस्त है। pic.twitter.com/n8EjSyJIz0
— Tejashwi Yadav (@yadavtejashwi) November 1, 2020