వచ్చింది 61 మార్కులు.. వేసింది 4, బీహార్ స్కూల్ బోర్డు నిర్వాకం, పోరాడి గెలిచిన విద్యార్థిని!
ఈ ఏడాది ఆరంభంలో బీహార్ ఎడ్యుకేషన్ బోర్డు పదో తరగతి ఫలితాలను వెల్లడించింది. అందులో ప్రియాంక సింగ్ అనే విద్యార్థిని రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు ప్రకటించింది. ఆ ఫలితాల్లో ఆమెకు సైన్స్లో 29, స
పాట్నా: బీహార్ ఎడ్యుకేషన్ బోర్డును వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆమధ్య బోర్డు పరీక్షల్లో మాస్ కాపియింగ్ జరగడం, అక్షరం ముక్క రాని వాళ్లను టాపర్లుగా ప్రకటించడం వంటి ఘటనలతో వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే.
ఆ కేసులు ఇంకా వీడకముందే తాజాగా ఈ ఎడ్యుకేషన్ బోర్డు మరో వివాదంలో చిక్కుకుంది. అయితే ఈసారి బాగా చదివే విద్యార్థిని ఫెయిల్ అయిందంటూ ప్రకటించింది. అదేంటని అడిగితే మరో విద్యార్థి జవాబు పత్రాలను చూపించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది.
ఈ ఏడాది ఆరంభంలో బీహార్ ఎడ్యుకేషన్ బోర్డు పదో తరగతి ఫలితాలను వెల్లడించింది. అందులో ప్రియాంక సింగ్ అనే విద్యార్థిని రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు ప్రకటించింది. ఆ ఫలితాల్లో ఆమెకు సైన్స్లో 29, సంస్కృతంలో 4 మార్కులు వచ్చాయి.
అయితే తాను పరీక్షలు బాగా రాశానని, ఫెయిల్ అయ్యే అవకాశమే లేదని ఆమె రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకుంది. రీవాల్యుయేషన్ ఫలితాలు చూసి ప్రియంక కంగుతింది. సంస్కృతంలో ఆమె మార్కులు 4 నుంచి 9కి పెరగగా.. సైన్స్లో మాత్రం తొలుత 29 వస్తే ఈసారి 7 మార్కులే వచ్చాయి.
దీంతో ఆ విద్యార్థిని పాట్నా హైకోర్టును ఆశ్రయించింది. అయితే తొలుత ప్రియాంక పిటిషన్ను కోర్టు నమ్మలేదు. కోర్టు సమయం వృథా అవుతుందేమోనన్న అనుమానంతో ఆమెను రూ.40 వేలు డిపాజిట్ కూడా చేయమని ఆదేశించింది.
ఆ తర్వాత విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రియాంక జవాబు పత్రాలను చూపించాలని స్కూల్ బోర్డును ఆదేశించింది. తమ పొరబాటును గ్రహించిన బోర్డు అది కప్పిపుచ్చుకునేందుకు మరో విద్యార్థి జవాబు పత్రాలను కోర్టుకు అందజేసింది.
అయితే
జవాబు
పత్రాల్లోని
చేతిరాత
ప్రియాంక
చేతిరాతతో
సరిపోలకపోవడంతో
అసలైన
ఆన్సర్
షీట్లు
తీసుకురావాలని
బోర్డును
ఆదేశించింది
న్యాయస్థానం.
అందులో
ప్రియాంకకు
సైన్స్లో
80
మార్కులు,
సంస్కృతంలో
61
మార్కులు
వచ్చాయి.
దీంతో ఎడ్యుకేషన్ బోర్డు చర్యపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు విద్యార్థినికి రూ.5 లక్షల నష్టపరిహారం కూడా చెల్లించాలని ఆదేశించింది. అంతేగాక ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని సూచించింది. అయితే బోర్డు మాత్రం బార్కోడ్ వల్లే ఈ తప్పిదం జరిగిందని చెప్పుకొస్తోంది.