బిహార్ ఎన్నికల్లో రెండో దశ: రాహుల్ గాంధీ షెడ్యూల్ ఫిక్స్: రోడ్ షోలు..ర్యాలీలు: గెలుపుపై ఆశలు
పాట్నా: బిహార్లో తొలివిడత ఎన్నికల ప్రచార హోరుకు బ్రేక్ పడింది. బుధవారం అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం కాబోతోండగా.. నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తొలివిడతలో 16 జిల్లాల్లో 71 అసెంబ్లీ నియోజకవర్గాల కోసం పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 1,066 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండు కోట్ల 14 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 31 వేల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.
Recommended Video
టాప్ అడ్వొకేట్ హరీష్ సాల్వే రెండో పెళ్లి: 65 ఏళ్ల వయస్సు: 18 ఏళ్ల కుమార్తె తల్లితో: లండన్లో
రెండో విడత పోలింగ్ వచ్చేనెల 3వ తేదీన నిర్వహించనున్నారు. అదే నెల 7వ తేదీన చివరి విడత ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. 10వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడవుతాయి. తొలి విడతలో పోలింగ్ నిర్వహించనున్న 71 అసెంబ్లీ స్థానాల్లో అధికార జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని మహాకూటమి ప్రభుత్వం మెజారిటీ స్థానాలను సాధించే అవకాశాలు ఉన్నాయంటూ సర్వేలు వెల్లడించాయి. దీనితో జేడీయూ-బీజేపీ సంకీర్ణ కూటమిలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోంది. మలి, తుది విడతల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవడానికి ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్-కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ నెల 28వ తేదీన ఒకేసారి రెండు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనబోతున్నారు. వాల్మీకీనగర్, కుషేశ్వర్ అస్థాన్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల రూట్ మ్యాప్ను రూపొందించింది. యాదవ, మైనారిటీ సామాజిక వర్గం ఓటుబ్యాంకు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలను నిర్వహించనున్నారు. రోడ్ షోల్లో పాల్గొనబోతున్నారు. రెండో విడత, తుది దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాలపై పట్టు సాధించడానికి రాష్ట్రీయ జనతాదళ్తో కలిసి కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను తలపెట్టారు.