కరోనాపై ఓటరు పైచేయి: ఈసీ సక్సెస్ - ప్రశాంతంగా ముగిసిన ఫస్ట్ ఫేజ్ - బీహార్ పోల్ ఫొటోలివి..
వేల ఏళ్ల పరిణామక్రమంలాగే.. ప్రస్తుత కరోనా విలయాన్ని ప్రజలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రజాస్వామిక పండుగలా భావించే ఎన్నికల ప్రక్రియలో వైరస్పై ఓటరు పైచేయి సాధించాడు. కరోనా కాలంలో జరిగిన తొలి ఎన్నికల్లో భారతీయులు.. అందునా బీహారీలు గొప్ప చైతన్యం ప్రదర్శించారు.
కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయడంలో ఎన్నికల సంఘం సక్సెస్ అయిందనే చెప్పాలి. మొత్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో తొలి దశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది.
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో ఫస్ట్ ఫేజ్ లో భాగంగా బుధవారం 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు 52.24 శాతం పోలింగ్ నమోదైంది. గత(2015) ఎన్నికల ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ (54.94శాతం)గా ఉంది.
అయితే, రాత్రికిగానీ ఫుల్ డీటెయిల్స్ అందుబాటులోకి వస్తాయని, చాలా చోట్ల 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారని, ఈసారి లెక్కలు స్వల్పంగా పెరిగే ఛాన్స్ ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.
తొలి దశలో పోలింగ్ జరిగిన 71 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 31 వేల పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా ఓటర్లకు థర్మల్ స్కానింగ్, చేతులకు శానిటైజేషన్, మాస్కుల ధారణ పక్కాగా అమలు చేశారు. కొన్ని మినహా మెజార్టీ స్టేషన్లలో సోషల్ డిస్టెన్సిన్ నియమాన్ని కచ్చితంగా ఆచరించారు. పోలింగ్ సిబ్బందితోపాటు ఓటర్లు సైతం కరోనా పట్ల తమ చైతన్యాన్ని ప్రదర్శించారు.
బీహార్ మంత్రి, బీజేపీ నేత, గయా అసెంబ్లీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ వ్యవహారం వివాదానికి దారి తీసింది. కమలం గుర్తు కలిగిన మాస్కును ధరించి ఆయన పోలింగ్ బూత్ లో ఓటేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇది ముమ్మాటికీ నిబంధనల ఉల్లంఘనే అని, మంత్రి ప్రేమ్ కుమార్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎన్నికల అధికారులు చెప్పారు.
Bihar: First phase polling of Bihar Assembly elections underway, following #COVID19 norms.
— ANI (@ANI) October 28, 2020
Visuals of voters queuing up outside booth number 43 in Paliganj and undergoing temperature check. pic.twitter.com/EDMDKDZITp
ఫస్ట్ ఫేజ్ లో నక్సల్స్ ప్రభావిత సెగ్మెంట్లలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడం గమనార్హం. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నిర్దేశించిన ప్రాంతాలకు ఈవీఎంలను చేరవేసే ప్రక్రియ వేగంగా సాగుతున్నది. బీహార్ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ నవంబర్ 3న, చివరిదైన మూడో దశ పోలింగ్ నవంబర్ 7న జరుగనుంది.
Bihar: Voting underway in Sasaram for the first phase of Bihar Assembly elections.
— ANI (@ANI) October 28, 2020
Visuals of voters undergoing temperature check & hand-sanitisation in a polling booth decorated with balloons pic.twitter.com/BMMNL7n0XU
Bihar Minister and BJP leader Prem Kumar arrives at a polling booth in Gaya to cast his vote wearing a mask with his party's symbol. #BiharElections2020 pic.twitter.com/PAerqVerNs
— ANI (@ANI) October 28, 2020
Voting underway at polling booth number 23 in Mokama for the first phase of #BiharAssemblyElection2020. pic.twitter.com/nmTOBwrnmJ
— ANI (@ANI) October 28, 2020