బీహరీలు బీజేపీతోనే, అనుకూలంగానే ఫలితాలు: ప్రభుత్వ వ్యతిరేకత ఉండదు, కమల దళం ధీమా
బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఆయా పార్టీలు ధీమాతో ఉన్నాయి. ఒపినీయన్ పోల్స్ నితీశ్ కుమార్కు మొగ్గుచూపాయి. అయితే గత 15 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని భావిస్తోన్నారు. కానీ జేడీయూతో కలిసి పోటీచేస్తోన్న బీజేపీ మాత్రం తమపై ప్రభావం చూపదని చెబుతోంది. అందుకు గల కారణాలను కూడా వివరిస్తోంది.
బీహర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమపై చూపదని కమలదళం అంటోంది. నితీశ్ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనప్పటికీ బీజేపీ గురించి ప్రజలు చెడుగా మాట్లాడరని తెలిపింది. డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ గురించి ఒక్కరు కూడా మాట్లాడరని గుర్తుచేసింది. చాలా మందిని అడిగితే.. ప్రభుత్వం నడిపేవారికి వస్తోందని.. మంచి, చెడు అని చెబుతున్నారు. దీంతో తమ విజయవకాశాలు సన్నగిల్లయని విశ్వాసంతో ఉన్నారు.
బీహర్లో కులం కార్డుతో రాజకీయాలు సాగుతున్నాయి. రాష్ట్ర జనాభాలో ఉన్నత కులాల వారు 15 శాతం వరకు ఉంటారు. అయితే నితీశ్ కుమార్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఆర్జేడీ-ఎల్జేపీకి మద్దతు ఇస్తున్నారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఒకరికీ మరొకరు పరోక్షంగా మద్దతు తెలుపుకున్నారు. అయితే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో మాత్రం యాదవులు, ముస్లింలు తిరిగి జంగిల్ రాజ్ అధికారంలోకి వస్తారని కామెంట్ చేస్తున్నారు. బీహర్లో గల ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తారనే ధీమాతో ఉన్నారు.
జేడీయూ పోటీ చేస్తోన్న స్థానాల్లో ఎల్జేపీకి బహిరంగంగా మద్దతు తెలుపడం విశేషం. ఇక్కడ ఉన్నత కుల అభ్యర్థులను నిలబెట్టారు. భూమిహార్ కమ్యూనిటీ నుంచి చాలా మంది ఉన్నారు. వీరు ఎల్జేపీ అభ్యర్థుల కోసం బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. వీరు మద్దతు తెలుపుతున్న ఎల్జేపీ అభ్యర్థులు మాత్రం వెనకబడి ఉన్నారు.