స్నేహితులపై దాడి: యువతుల దుస్తులు చించి, అసభ్యంగా తాకి, ఇద్దరు అరెస్ట్
పాట్నా:బీహర్ రాష్ట్రంలో కొందరు దుండగులు ఇద్దరు యువతులపై పైశాచికంగా ప్రవర్తించారు. స్నేహితులతో కలిసి వెళ్తున్న యువతులను అడ్డుకొని యువతుల దుస్తులను చించివేసేందుకు ప్రయత్నించారు. వారిని అసభ్యంగా తాకారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. మీడియా దృష్టికి ఈ దృశ్యాలు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
దేశంలో ఏదో ఒక చోట ప్రతిరోజూ మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా ఈ తరహ ఘటనలు మాత్రం ఆగడం లేదు.
బీహర్ లో కొందరు దుండగులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉంది. ఇద్దరు యువతుల పట్ల అత్యంత దారుణంగా ఆ దుండగులు వ్యవహరించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరిని ఇప్పటికే పోలీసలు అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇద్దరు యువతులపై అసభ్యంగా
బీహార్ రాష్ట్రంలోని గయలో గల వాజిర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఘటన చోటు చేసుకొంది. మే 17 లేదా 18 తేదిల్లో ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు చెప్పారు. స్నేహితులతో వెళ్తున్న ఇద్దరు యువతలను అడ్డగించారు. స్నేహితులను చితకబాదారు. ఆ యువతుల దుస్తులను చించేందుకు ప్రయత్నించారు. అంతేకాదు వారిని అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించారు.
సోషల్ మీడియాలో దృశ్యాలు
ఇద్దరు యువతుల దుస్తులను చించివేసేందుకు ప్రయత్నించడంతో పాటు వారిని అసభ్యంగా తాకుతూ ఆ దుండగులు పైశాచిక ఆనందానికి లోనయ్యారు. అంతేకాదు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. తక్కువ సమయంలోనే ఈ వీడియోలు ఎక్కువమందికి చేరుకొన్నాయి.
మీడియా కారణంగా వెలుగులోకి
సోషల్ మీడియాలో ఇద్దరు యువతుల దుస్తులను లాగేసి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. యువతుల పట్ల ఆ దుండగులు ఏ రకంగా వ్యవహరించారనే దానిపై మీడియా సవివరంగా వార్తా కథనాలను ప్రసారం చేసింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు.
ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఇద్దరు యువతుల పట్ల దుండగులు దారుణంగా ప్రవర్తించడంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టుగా గయ ఏఎస్పీ రాజీవ్ మిశ్రా ప్రకటించారు. మీడియా ద్వారా విషయం తెలిసినట్టు ఆయన చెప్పారు. కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి విజయ్ యాదవ్, సుధీర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు ఆయన చెప్పారు. మిగిలిన నిందతులను కూడ అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు.