ముస్లీం యువతుల పెళ్లికి గ్రామ హిందువుల సాయం
గ్రేటర్ నోయిడా: ఉత్తర ప్రదేశ్లో దాద్రీ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇలాంటి సమయంలో ఓ గ్రామానికి చెందిన హిందువులు అందరూ... ఓ పేద ముస్లీం అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశారు. ఈ సంఘటన బిసడ గ్రామంలో జరిగింది.
బిసడ గ్రామానికి హకీమ్ అనే వ్యక్తికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిల పెళ్లి ఆదివారం ఉదయం జరిగింది. పెళ్లికి సంబంధించిన ఖర్చులు గ్రామానికి చెందిన హిందువులు భరించారు.
అంతేకాదు, తన కూతుళ్ల పెళ్లి నేపథ్యంలో హకీమ్ తొలుత.. గ్రామం బయట ఈ వేడుకను ఏర్పాటు చేద్దామనుకున్నాడు. దాద్రీలో మాంసం ఘటన, మృతి నేపథ్యంలో.. గ్రామం బయట పెళ్లి చేద్దామని భావించాడు.
అయితే, గ్రామంలోని హిందువులు అందరూ ఆయనకు అండగా నిలబడ్డారు. అలాంటి ఘటనలు ఏమీ ఉండవని, అందరం అండగా నిలబడతామని చెప్పారు. దీంతో హకీమ్ కుటుంబం ఆదివారం గ్రామంలో పెళ్లి చేసింది. ఇందుకు గ్రామంలోని హిందువులు ఆర్థిక సాయం కూడా చేశారు.