షాకింగ్: బిట్ కాయిన్ ఎక్స్ఛేంజ్ చీఫ్ కిడ్నాప్
న్యూఢిల్లీ: వర్చువల్ కరెన్సీగా పేరుగాంచిన బిట్ కాయిన్.. ఎక్స్ఛేంజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పావెల్ లెర్నర్(40) ఉక్రెయిన్లో కిడ్నాప్కు గురయ్యారు. ఆయన తన కార్యాలయం నుంచి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
నల్లటి మెర్సిడిజ్ బెంజ్ వాహనంలో వచ్చిన కొంతమంది దుండగులు లెర్నర్ను అపహరించినట్లు తెలుస్తోంది. లింక్డిన్ ప్రొఫైల్లో ఉన్న సమాచారం మేరకు.. పావెల్ లెర్నర్ 2012లో రష్యాలోని కుర్స్క్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు.
పావెల్ ప్రముఖ బ్లాక్ చెయిన్ నిపుణుడు. ఆయన కిడ్నాప్ అయ్యారనే వార్తలు వెలువడడంతో ఇంటర్నేషనల్ క్రిప్టో కరెన్సీ కమ్యూనిటీ ఒక్కసారిగా షాక్కు గురైంది. బిట్ కాయిన్ వెబ్సైట్ కూడా తాత్కాలికంగా క్రాష్ అయినట్లు, పని చేయడం మానేసినట్లు సమాచారం.
అయితే బిట్ కాయిన్ వ్యాపారానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని, ఎక్స్ఛేంచ్ మామూలుగానే పనిచేస్తోందని, ఈ కిడ్నాప్ వ్యవహారం బిట్ కాయిన్ యూజర్ల లావాదేవీలపై ఎలాంటి ప్రభావం పడలేదని బిట్ కాయిన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.