వామ్మో.. సోదరుడి ఆత్మ దాడి, గొంతుకోసి చంపిందట...? పొరుగు రాష్ట్రంలో కలకలం
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ది చెందిన ఫలితం లేకుండా పోతోంది. దెయ్యాలు, భూతాలు అంటూ కొందరు విశ్వసిస్తూనే ఉన్నారు. మహారాష్ట్రలో థానేలో అయితే ఏకంగా సోదరుడి ఆత్మ.. యువకుడిపై దాడి చేసినట్టు స్థానికులు విశ్వసిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏం జరిగిందనే విషయంపై ఆరాతీస్తున్నారు.
మహారాష్ట్ర థానేలో గల భీవండి టౌన్షిప్ నార్పొలిలో 31 ఏళ్ల తులసీ రాం చవాన్ అనే యువకుడు నివసిస్తున్నాడు. అతని తల్లిండ్రులు చనిపోయిన.. అక్కడే ఉంటూ జీవిస్తున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితం అతని సోదరుడు కూడా వచ్చి.. యువకుడి వద్ద ఉంటూ.. గడుపుతున్నారు.
ఏం జరిగిందో తెలియదు కానీ గతనెల 2వ తేదీన తులసీరాం.. సోదరుడు చనిపోయాడు. ఇక అప్పటినుంచి సమస్య ప్రారంభమైంది. తన సోదరుడి ఆత్మ తనను వెంబడిస్తోందని తులసీరామ్ చావన్ చెబుతున్నాడు. కానీ అతని మాటలను స్ధానికులు విశ్వసించలేదు.
కానీ తులసీ రాం చెప్పింది విశ్వసించకపోవడంతో... అతను విగతజీవిగా మారాడు. శుక్రవారం రాత్రి తన సోదరుడి ఆత్మ వచ్చి తనపై దాడి చేసిందని యువకుడు పక్కింటి మహిళతో పేర్కొన్నారు. దీంతో తమ ఇంటిలోకి వచ్చి పడుకోవాలని సూచించింది. అలా ఇంట్లోకి వెళ్లిన తులసీ రాం తిరిగిరాలేదు. మరునాడు చూస్తే తులసీ రాం గొంతుకోసి ఉంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. తులసీ రాం మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.