అమ్మకానికి కిడ్నీ : కానీ ఎందుకో తెలుసా ?
ఒక వ్యక్తి తన కిడ్నీని అమ్మకానికి పెట్టాడు.విడాకులు తీసుకొన్న భార్యకు భరణం చెల్లించేందుకు గాను కిడ్నీ అమ్మకానికి పెట్టాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకొంది.
Recommended Video
భోపాల్: ఒక వ్యక్తి తన కిడ్నీని అమ్మకానికి పెట్టాడు.విడాకులు తీసుకొన్న భార్యకు భరణం చెల్లించేందుకు గాను కిడ్నీ అమ్మకానికి పెట్టాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకొంది.
ఎవరైనా బతకడానికి డబ్బుల్లేకో లేదంటే ఇంట్లో ఎవరికైనా బాగోకపోతేనే బాడీ పార్ట్శ్ అమ్ముకోవడం చూసుంటాం. కానీ విడాకులు తీసుకున్న భార్యకు భరణం కట్టడానికి అతడు కిడ్నీ ని అమ్మకానికి పెట్టాడు.
మధ్యప్రదేశ్లోని విదిష నుంచి వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన, విడాకులు తీసుకున్న భార్యకు చెల్లించాల్సిన డబ్బుల కోసం ఒక వ్యక్తి తన మూత్రపిండాలను విక్రయించారు.
ఐతే బాధితుడు వృత్తి పరంగా ఒక ప్లంబర్. ఐతే దేశం నలువైపుల నుండి అతనికి మూత్రపిండాల కోసం కాల్స్ చేస్తున్నారు . అతను మాత్రం రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం . ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం రోజూ ఐతే ఇది మాత్రం కొంచెం కొత్తగా కన్పిస్తోంది.