బెంగళూరులో మిడ్ డే మీల్స్ లో కుక్క, పిల్లి మాంసం, వింత కాదు నిజం, ప్రతి రోజూ ఉండాలి!
బెంగళూరు: సామాన్యంగా చాల మంది ప్రతిరోజూ కోడి, మేక, గొర్రె మాంసం, చేపలు, రోయ్యలు, కోడిగుడ్లు తింటుంటారు. వీలైతే మాంసాహార ప్రియులు పక్షుల మాంసం తింటుంటారు. అయితే ఐటీ బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో విచిత్రం జరుగుతోంది.
రోడ్డున పోతున్న జంతువులను చంపి తింటున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. బెంగళూరు నగరంలోని విజయనగరలో ప్రసిద్ది చెందిన ఆది చుంచునగిరి మఠం ఉంది. ఆది చుంచునగిరి మఠంకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, భక్తులు, వివిద పార్టీల రాజకీయ నాయకులు భేటీ అవుతుంటారు.
ఆది చుంచునగిరి మఠంకు ఎదురుగా ఉన్న సర్వీసు రోర్డులో తమిళనాడుకు చెందిన దాదాపు 15 మంది వచ్చి నివాసం ఉంటూ క్వారీలో కూలి పనులు చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన వీళ్లు వీది కుక్కలు, పిల్లులను చంపి వాటిని నిప్పుల్లో కాల్చి మాంసం ముక్కలుగా చేస్తున్నారు.
ప్రతి రోజూ మద్యాహ్నం భోజనంలో కుక్క, పిల్లి మాంసం తింటున్నారు. వీరు తీరు గమనించిన స్థానికులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. వీది కుక్కలు, పిల్లులను చంపి తింటున్న వీరిని చూసి ఆసహ్యం పెంచుకుంటున్నారు. అయితే మాకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అని వారు అంటున్నారని స్థానికులు చెబుతున్నారు. కుక్క, పిల్లి మాంసం తింటున్న వారిలో మహిళలు, పిల్లలు సైతం ఉన్నారు.