వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు మాజీ సీఎంలకు బీజేపీ కీలక పదవులు, ఉత్తర్వులు జారీ చేసిన అమిత్ షా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలి వరకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ముఖ్యమంత్రులగా పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, రమణ్ సింగ్‌లకు పోస్టులు కట్టబెట్టింది.

పార్టీ అధిష్టానం వారి ముగ్గురిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వీటిని జారీ చేశారు. దీంతో రానున్న లోకసభ ఎన్నికల్లో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.

BJP Appoints Shivraj Singh Chouhan, Vasundhara Raje and Raman Singh as Party Vice Presidents

రాబోయే లోకసభ ఎన్నికల పైన చర్చించేందుకు అమిత్ షా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నేషనల్ కౌన్సెల్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ మేరకు ట్వీట్ చేస్తూ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను (రమణ్, శివరాజ్, వసుంధరా) పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్ ప్రభుత్వాలు మూడు పర్యాయాలు ఉన్నాయి. వసుంధర రాజే ఇటీవలి వరకు రాజస్థాన్ సీఎంగా ఉన్నారు.

English summary
Ahead of Lok Sabha polls, the BJP Thursday appointed former chief ministers Shivraj Singh Chouhan, Raman Singh and Vasundhara Raje as its vice presidents, bringing its three powerful state leaders into the national politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X