అమిత్ షాకు నోటీస్ ఇవ్వగలరా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయగలరా: ఈసిపై కాంగ్రెసు భగ్గు
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ కన్నా ముందే బిజెప ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను లీక్ చేయడంపై కాంగ్రెసు పార్టీ భగ్గుమంది. ఈసి కన్నా ముందే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలంటూ మాల్వియా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
బిజెపి సూపర్ ఎలక్షన్ కమిషన్ అయిపోయిందని కాంగ్రెసు అధికార ప్రతినిధి రణదీప్ సిగ్ సుర్జేవాలా మండిపడ్డారు. ఈసి కన్నా ముందే కర్ణాటక ఎన్నికల తేదీలను వెల్లడిస్తుందని, ఆ రకంగా బిజెపి సూపర్ ఎలక్షన్ కమిషన్ అయిపోయిందని ఆయన ట్వీట్ చేశారు.
BJP becomes the ‘Super Election Commission’ as they announce poll dates for Karnataka even before the EC.
— Randeep Singh Surjewala (@rssurjewala) March 27, 2018
Credibility of EC is on test.
Will EC now issue notice to BJP President, Amit Shah & register an FIR against BJP IT Head for leaking EC’s confidential information? pic.twitter.com/i3vU2iJpjH
ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఈసి నోటీసు ఇవ్వగలదా, బిజెపి ఐటి సెల్ చీఫ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయగలదా అని ఆయన ఈసిని ప్రశ్నించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసి ప్రకటించడానికి కాస్తా ముందు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 12వ తేదీన జరుగుతాయని, ఓట్ల లెక్కింపు మే 18వ తేదీన జరుగతుందని మాల్వియా ట్వీట్ చేశారు.