వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీఎంసి 220 వార్డులో విజేతను నిర్ణయించిన లాటరీ, బిజెపి అభ్యర్థే విజేత

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:బీఎంసి ఎన్నికల్లో బిజెపి, శివసేన హోరాహోరిగానే తలపడ్డాయి. ఈ రెండు పార్టీల మద్య ప్రధానంగా పోటీ సాగింది. శివసేనకు ఎక్కువ సీట్లు వచ్చాయి.అయితే శివసేన సిట్టింగ్ కార్పోరేటర్ సురేంద్ర బాగల్కర్ పై బిజెపి అభ్యర్థి అతుల్ షా లాటరీలో విజయం సాధించాడు.

బుదవారం నాడు బీఎంసికి ఎన్నికలు జరిగాయి. గురువారం నాడు ఓట్ల లెక్కింపు పూర్తైంది. అయితే శివసేన,బిజెపిలు రెండు హోరాహోరిగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో శివసేనకు 84 సీట్లు, బిజెపికి 81 సీట్లు దక్కాయి.

బీఎంసి లోని 220 వ, వార్డుకు శివసేన అభ్యర్థి సురేంద్ర బాగల్కర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ధఫా కూడ ఆయన మరోసారి బరిలో నిలిచాడు.అయితే ఆయనపై బిజెపి అభ్యర్థిగా అతుల్ షా బరిలో నిలిచాడు.

 bjp candidate Atul Shah won 220 ward in lottery

అయితే బీఎంసి 220 వార్డులో ఇధ్దరు శివసేన అభ్యర్థి సురేంద్ర బాగల్కర్ కు, బిజెపి అభ్యర్థి అతుల్ షా కు సమానంగా ఓట్లు వచ్చాయి.అయితే అధికారులు రీ కౌంటింగ్ నిర్వహించారు. రీ కౌంటింగ్ నిర్వహించినా అదే పరిస్థితి వచ్చింది.

దీంతో అధికారులు లాటరీ నిర్వహించారు. ఈ లాటరీలో బిజెపి అభ్యర్థి అతుల్ షా ను విజయం వరించింది. అత్యంత ఉత్కంఠభరితంగా ఈ వార్డు కౌంటింగ్ సాగింది. చివరకు ఈ వార్డులో బిజెపి అభ్యర్థఇ అతుల్ షా విజయం సాధించాడు.

బీఎంసి ఎన్నికల్లో బిజెపి, శివసేన హోరాహోరిగానే తలపడ్డాయి. ఈ రెండు పార్టీల మద్య ప్రధానంగా పోటీ సాగింది. శివసేనకు ఎక్కువ సీట్లు వచ్చాయి.అయితే శివసేన సిట్టింగ్ కార్పోరేటర్ సురేంద్ర బాగల్కర్ పై బిజెపి అభ్యర్థి అతుల్ షా లాటరీలో విజయం సాధించాడు.

English summary
BJP’s Atul Shah wins ward no 220 by lottery after tying with Surendra Bagalkar after recounting in mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X