''మిమ్మల్ని ఇంట్లో నుండి ఈడ్చుకు వచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టిస్తా '' బీజేపీ అభ్యర్థి
ఎన్నికల సంధర్భంలో ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఘటనలు కోకల్లలు ఈనేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తాజగా ఓ మాజీ ఐపిఎస్ అధికారిని ఓటర్లను పోలీస్ స్టైల్లో హెచ్చరించింది. తనకు ఓటు వేయకపోతే జరిగే పరిణామాలను వివరిస్తూ వారిని హెచ్చరించింది. దీంతో ఆమే హెచ్చరికలు వీడియోల ద్వార బయటికి వచ్చాయి.
ఓట్లు వేయించుకునేందుక పలు రకాల మార్గాలు కోందరు అభ్యర్థులు డబ్బులు పంపిణి చేస్తే మరికొందరు ఓటర్లుకు నచ్చే తాయిలాలు ఇస్తారు. ఇంకోందరు గ్రామాల అభివృద్దికి కావాల్సిన డబ్బులు అందిస్తారు.ఇలా రకారకాల అభ్యర్థులను చూశాం కాని పశ్చిమబెంగాల్లో మాత్రం ఓ మహిళ అభ్యర్థి అదికూడ మాజీ ఐపిఎస్ అధికారి మాత్రం ఓటర్లను తనదైన స్టైల్లో బెదిరించింది.
#WATCH:BJP candidate from Ghatal, WB & ex IPS officer Bharati Ghosh threatens TMC workers,says,"You are threatening people to not cast their votes. I will drag you out of your houses and thrash you like dogs. I will call a thousand people from Uttar Pradesh to beat you up." (4/5) pic.twitter.com/GvX650F6n9
— ANI (@ANI) May 5, 2019
బెంగాల్ నుండి ఘటల్ అనే లోక్ సభ స్థానం నుండి భారతీ ఘొష్ అనే మాజీ ఐపిఎస్ అధికారిని బీజేపి నుండి పోటీ చేస్తోంది. ఆదివారం ప్రచారంలో నిర్వహించింది. ఇందులో భాగంగా ఆమే ఓటర్లతో మాట్లాడుతూ..మా ఓటర్లనే ఓటు వేయకుండా బెదిరిస్తారా...? ''మిమ్మల్ని ఇంట్లోనుండి బయటకు తీసుకువచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా " అంటూ తృణముల్ పార్టీ కార్యకర్తలపై ఫైర్ అయింది.