అమిత్షా గూగ్లీ: కేరళ ఎన్నికలబరిలో క్రికెటర్ శ్రీశాంత్?
తిరువనంతపురం: బిజెపి వైపు సినిమా తారలకు, క్రీడాకారులకు, ప్రముఖులకు బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా గాలం వేస్తున్నారు. ఇందులో భాగంగా క్రికెటర్ శ్రీశాంత్ పైన కూడా బిజెపి కన్ను పడిందని తెలుస్తోంది. శ్రీశాంత్ ద్వారా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ పైన గూగ్లీ వేయాలని బిజెపి భావిస్తోంది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ను దించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం గురించి పార్టీ వర్గాలు శ్రీశాంత్తో చర్చలు జరిపారని తెలుస్తోంది. అయితే తనకు సమయం కావాలని నిర్ణయం త్వరలోనే చెబుతానని శ్రీశాంత్ చెప్పాడని తెలుస్తోంది.
తన కుటుంబ సభ్యులతో ఎన్నికల్లో పోటీ వి,యమై శ్రీశాంత్ చర్చలు జరుపుతున్నారు. ఆయన అంగీకరిస్తేత్రిపునితుర నుంచి పోటీ చేసే అవకాశముంది. ఎక్సైజ్ మంత్రి కె బాబుకి ప్రత్యర్థిగా శ్రీశాంత్ బరిలో దిగే అవకాశముంది.