శబరిమల ఎఫెక్ట్, ప్రథానంథిట్టా నియోజక వర్గ సీటు కేటాయింపు సస్పెన్స్
కేరళలో పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై ఇంకా సస్పెన్స్ వీడలేదు..బీజేపి లోని రెండు వర్గల మధ్య పోరు ,తీవ్ర స్థాయికి చేరింది.కేరళ లో బిజేపి పోటి చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటికి ,ఇటివల శబరిమల అయ్యప్ప సన్నిధిలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఆ నియోజకవర్గమైన పథానంతిట్టా నియోజకవర్గానికి మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించడంపై సస్పెన్స్ వీడలేదు.
ఈ నేపథ్యంలోనే బిజేపి మొత్తం 20 లోక్ సభ స్థానాలకు గాను 14 స్థానాల్లో పోటి చేస్తుండగా, భారత్ ధర్మ జనసేన అయిదు, కేరళ కాంగ్రెస్ కు చెందిన పీసీ థామస్ ఒక స్థానంలో పోటి చేస్తున్నారు..అయితే బిజేపి పోటి చేస్తున్న పద్నాలుగు స్థానాల్లో పదమూడూ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది..వీరిలో ప్రముఖంగా మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తో మరియు కేంద్రమంత్రి ఆల్ఫోన్స ఉన్నారు.
అయితే మిగిలిన స్థానమైన ప్రథానంతిట్టా నియోజకవర్గానికి గాను కేరళ బిజేపి అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై మరియు పార్టీ జనరల్ సెక్రటరీ కే. సురేంద్రన్ మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది.దీంతో సీటు కేటాయింపు పై ఆలస్యం జరుగుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.కాగా సురేంద్రన్ కు సీటు కేటాయించాలని అటు సోషల్ మీడియాతోపాటు ఆర్ఎస్ఎస్ నుండి ఒత్తిడి పెరుగుతోంది.